బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన టౌన్ డీఎస్పీ సింధుప్రియ_
ఎస్పీ గ్రీవెన్స్ కి వంద వినతులు
- బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన టౌన్ డీఎస్పీ సింధుప్రియ
పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం వంద ఫిర్యాదులు అందాయని టౌన్ డీఎస్పీ సింధుప్రియ తెలిపారు. ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని బాధితులకి ఆమె హామీ ఇచ్చారు.
జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు…నెల్లూరు టౌన్ డీఎస్పీ సింధుప్రియ నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పలువురు పోలీసు అధికారులతో కలసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదిదారులతో డీఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 100 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీతోపాటు…లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులు రెడ్డి, SB-2 CI శ్రీనివాసరెడ్డి, కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.