ఉగ్రవాదులకు మతం రంగు

_తీవ్రవాదులను పట్టుకోకపోవడంలో ప్రభుత్వం వైఫల్యం

ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు దేశ ప్రజలలో సమైక్యతను పెంపొందించాలి

నెల్లూరులో సీపీఎం సమైక్యతా యాత్రలు

ఉగ్రవాదులకు మతం రంగు…

  • తీవ్రవాదులను పట్టుకోకపోవడంలో ప్రభుత్వం వైఫల్యం
  • ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు దేశ ప్రజలలో సమైక్యతను పెంపొందించాలి
  • నెల్లూరులో సీపీఎం సమైక్యతా యాత్రలు


సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమైక్యతా యాత్రలు నిర్వహించారు. పెహల్గాం దాడులలో చనిపోయిన మృతులకు మరియు యుద్ధంలో చనిపోయిన వీర జవాన్లకు వారు నివాళులర్పించారు.


రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రదాడులకు మతం రంగు పులుమడం సరైనది కాదని సీపీఎం నేతలు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో నగరంలో సమైక్యతా యాత్రలు నిర్వహించారు. సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు దేశ ప్రజలలో సమైక్యతను పెంపొందించాలన్నారు. పెహల్గాం దాడులలో చనిపోయిన మృతులకు మరియు యుద్ధంలో చనిపోయిన వీర జవాన్లకు నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మూలం రమేష్, కత్తి శ్రీనివాసులు మాట్లాడారు. పెహల్గాం దాడులకు పాల్పడిన తీవ్రవాదులను నేటికీ పట్టుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమన్నారు. యుద్ధం వల్ల సాధించిన ఫలితాలను దేశ ప్రజలకు వివరించాలని… పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలన్నారు. భారత దేశ విధానాలను ట్రంప్ నిర్ణయించడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు, షేక్ మస్తాన్ బి, పి.సూర్యనారాయణ, కాయంబు శ్రీనివాసులు, నగర కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *