టిట్కో ఇళ్లపైకూడా రుణాలు తెచ్చుకున్న వైసీపీ ప్రభుత్వం
త్వరలో కడప, కాకినాడ, నెల్లూరు, విజయవాడల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు
కడప మున్సిపాలిటీల అధికారుల సమీక్షలో మంత్రి నారాయణ
విజయదశమికి లబ్ధిదారులకు టిట్కో ఇళ్లు
టిట్కో ఇళ్లపైకూడా రుణాలు తెచ్చుకున్న వైసీపీ ప్రభుత్వం
త్వరలో కడప, కాకినాడ, నెల్లూరు, విజయవాడల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు
కడప మున్సిపాలిటీల అధికారుల సమీక్షలో మంత్రి నారాయణ
ఉమ్మడి కడప జిల్లాలోని మున్సిపాల్టీల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. సమీక్షకు ఆన్ లైన్ లో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్,ఇతర ఉన్నతాధికారులు ఆన్లైన్లో హాజరయ్యారు. ఆయా మున్సిపాల్టీల్లో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు, టౌన్ ప్లానింగ్ అంశాలు, డ్రెయిన్ల పూడికతీతపై మంత్రి పొంగూరు దిశానిర్ధేశం చేశారు. కడప అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం నారాయణ మాట్లాడారు.
రాష్ట్రంలో టీడీఆర్ బాండ్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతుందని.. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లలో మౌళికవసతులు కల్పించకుండా నిర్లక్ష్యంగా వదిలేసిందన్నారు. విజయదశమి నాటికి టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని.. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై కూడా రుణాలు తెచ్చుకుందని ఈసందర్భంగా నారాయణ మండిపడ్డారు. అమృత్ పథకానికి కేంద్రం నిధులిచ్చినా.. రాష్ట్రం వాటా విడుదల చేయకపోవడంతో నిధులు విడుదల కాలేదన్నారు. గత ప్రభుత్వంవల్ల రాష్ట్రంలో 80 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని.. వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాల ద్వారా చెత్తను పూర్తిగా డ్రై చేసే విధానాన్ని అమలు చేయబోతున్నామన్నారు. త్వరలో కడప, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, విజయవాడలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో డంపింగ్ యార్డ్ లేకుండా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
అలాగే.. గత ప్రభుత్వం విచ్చలవిడిగా సిఎఫ్ఎంఎస్ నిధులను దుర్వినియోగం చేసిందన్నారు. 123 మున్సిపాలిటీలకు సి ఎఫ్ఎం ఎస్ నుండి గ్రీన్ ఛానల్ ఇస్తున్నామని.. ప్రజల అవసరాల దృష్ట్యా సి ఎఫ్ ఎం ఎస్ నుండి అమౌంట్ ను నేరుగా మున్సిపాలిటీలు వాడుకోవచ్చు అని.. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు తెలిపారు.