భారత్ సత్తా ఏంటో పాకిస్తాన్ కి తెలిసింది

బీజేపీ నేత మొగరాల సురేష్

నెల్లూరురూరల్ వేదాయపాళెంలో ఘనంగా తిరంగా యాత్ర

భారత్ సత్తా ఏంటో పాకిస్తాన్ కి తెలిసింది…

  • బీజేపీ నేత మొగరాల సురేష్
  • నెల్లూరురూరల్ వేదాయపాళెంలో ఘనంగా తిరంగా యాత్ర


ఆపరేషన్ సింధూర్ విజయవంతం సందర్భంగా…నెల్లూరు రూరల్ వేదాయపాళెంలో బీజేపీ నేత మోగరాల సురేష్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛంధంగా పాల్గొని జాతీయ జెండాలు చేతపట్టి.. భారత్ మాతాకీ జై నినాదాలు చేశారు.


గంటల వ్యవధిలో పాకిస్తాన్ పై చేసిన దాడులతో….భారత్ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసిందని బీజేపీ నేత, నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల, వైద్యకళాశాల అభివృద్ధి కమిటి డైరెక్టర్ మొగరాల సురేష్ తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం వేదాయపాళెం సెంటర్ లో సురేష్ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర జరిగింది. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించిన త్రివిధ దళాలకు మద్దత్తుగా కూటమి నాయకులు, ప్రజా సంఘాలు జాతీయ జెండాలు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై నినాదాలతో వేదాయపాళెం సెంటర్ మారుమోగింది. అనంతరం మొగరాల సురేష్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *