ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ

మంత్రి నారాయణ కుమార్తె షరణి, ఎమ్మెల్యే కోటంరెడ్డి సతీమణి సుజిత

ముక్కాల ద్వారకనాధ్ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో ఘనంగా తల్లికి వందనం

ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ

  • మంత్రి నారాయణ కుమార్తె షరణి, ఎమ్మెల్యే కోటంరెడ్డి సతీమణి సుజిత
  • ముక్కాల ద్వారకనాధ్ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో ఘనంగా తల్లికి వందనం

టీడీపీ నేత ముక్కాల ద్వారకాథ్ ఆధ్వర్యంలో తల్లికి వందనం కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె షరణి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సతీమణి కోటంరెడ్డి సుజితలు పాల్గొన్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో తాము పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.


ప్రపంచంలోకెల్లా తీయనైన పద్మం అమ్మ అని…అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువేనని…రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె షరణి, రూరల్ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి కోటంరెడ్డి సుజితలు అన్నారు. నెల్లూరు నగరంలోని పప్పులవీధిలో టీడీపీ నేత ముక్కాల ద్వారాకానాథ్ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో…దాతల దాత్రత్వంతో తల్లికి వందనం కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి వారు ముఖ్య అతిధులుగా షరణి, సుజితలు విచ్చేశారు. వారికి ముక్కాల ఘన ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. వారు తల్లుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు..ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ అని అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిదన్నారు..ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ… మాటలకు అందనిది అమ్మ ప్రేమ అని..బ్రహ్మ సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న తల్లులకు తమ పిల్లలు పాదాభివందనం చేసి…ఆశీర్వావచనాలు తీసుకున్నారు. కార్యక్రమాన్ని ద్వారాకానాథ్ మిత్రమండలి పర్యవేక్షించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *