జూన్ 12న ప్రారంభం – హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి కుమార్తె షరణి
దేశంలోనే బెస్ట్ స్కూల్ గా వీఆర్ హైస్కూల్
- జూన్ 12న ప్రారంభం
- హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి కుమార్తె షరణి
వీహైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ కుమార్తె షరణి పొంగూరు పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు ఆమె ఆరా తీశారు.
దేశంలోనే ద బెస్ట్ స్కూల్ గా వీఆర్ హైస్కూల్ ని తీర్చిదిద్దుతున్నామని మంత్రి నారాయణ కుమార్తె షరణి తెలిపారు. నెల్లూరు నగరంలోని వీఆర్సీ హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆమె పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై ఆమె ఆరా తీశారు. పనుల్లో మరింత వేగం పెంచాలని ఎన్సీసీ సిబ్బందికి సూచించారు. స్కూల్ ఆధునీకరణ పర్యవేక్షణ బాధ్యతలు నాకు అప్పగించారన్నారు. జూన్ 12 న స్కూల్ ప్రారంభమౌతుందని ఆమె చెప్పారు. అనంతరం డాక్టర్ పొంగూరు షరణి మీడియాతో మాట్లాడారు. ఆమె వెంట పలువురు పలువురు అధికారులు, సిబ్బంది ఉన్నారు.