మీడియా సమావేశంలో మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్
నెల్లూరులోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంకు చేరుకుంటున్న నేతలు
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, రూరల్ ఇన్ఛార్జి ఆనం
గోవర్థన్రెడ్డికి అండగా ఉంటాం
మీడియా సమావేశంలో మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్
నెల్లూరులోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంకు చేరుకుంటున్న నేతలు
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, రూరల్ ఇన్ఛార్జి ఆనం
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అరెస్టుతో జిల్లా వైసీపీలో కలకలం రేగుతోంది. ఈవిషయం తెలిసిన వెంటనే నెల్లూరు డైకాస్రోడ్డులోని వైసీపీ కార్యాలయంకు జిల్లా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ముందుగా అనిల్ కుమార్ యాదవ్, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ, సిటీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, రూరల్ ఇన్ఛార్జి ఆనం జయకుమార్రెడ్డి తదితర ముఖ్యనేతలు అక్కడకు చేరుకున్నారు. పార్టీ కార్యాలయంలో కొంత సేపు ఏకాంతంగా చర్చించారు. రేపు వారు చేపట్టబోయే కార్యాచరణ గురించి చర్చించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈసమావేశంలో మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని.. సంక్షేమం లేదని.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతుందంటూ ధ్వజమెత్తారు. జిల్లాలలోనూ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డికి సంబంధంలేని వ్యవహారంలో అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారన్నారు. కాకాణి గోవర్థన్రెడ్డికి పార్టీ నేతలంతా అండగా ఉంటామన్నారు. అలాగే.. కాకాణి గోవర్థన్రెడ్డి అరెస్టుపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయని.. దీనిపై పోలీసు అధికారులు స్పష్టమైన ప్రకటన చేస్తే బాగుంటుందన్నారు. ఇంకా పలు విషయాలను ఆయన వెళ్లడించారు.