ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని క్రమక్రమంగా నెరవేరుస్తున్నాం
మంత్రి నారాయణ కుమార్తె షరణి
పదో డివిజన్లో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న షరణి
కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటాం
- న్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని క్రమక్రమంగా నెరవేరుస్తున్నాం
- మంత్రి నారాయణ కుమార్తె షరణి
- పదో డివిజన్లో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న షరణి
పార్టీ కోసం కష్టపడిన ప్రతీ కార్యకర్తలకి నిరంతరం అందుబాటులో ఉంటామని మంత్రి నారాయణ కుమార్తె షరణి హామీ ఇచ్చారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పదవ డివిజన్లో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు తిరుమల నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఆమెకి టిడిపి శ్రేణులు సాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. కార్యకర్తలతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడిన ఆమె వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పొంగూరు షరణి మాట్లాడారు. ఏ సమస్య వచ్చిన తమను కార్యకర్తలు సంప్రదించవచ్చని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వెంకటరావు, బూత్ కన్వీనర్ గురు ప్రసాద్..మల్లి కార్జున.. శ్రీనివాస్ యాదవ్.. హారి,బాబు,రమేష్, రవి ..టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.