రోడ్డుప్రమాదంలో మృతిచెందిన వైసీసీపీ నాయకులు ఫిరంగి బాబురావు
కొడుకు కిరణ్కుమార్కు తీవ్రగాయాలు
నెల్లూరు మెడికవర్లో చికిత్స పొందుతున్న కిరణ్ను పరామర్శించి
కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన చంద్రశేఖర్రెడ్డి
అధైర్యపడొద్దు.. పార్టీ అండగా ఉంటుంది
రోడ్డుప్రమాదంలో మృతిచెందిన వైసీసీపీ నాయకులు ఫిరంగి బాబురావు
కొడుకు కిరణ్కుమార్కు తీవ్రగాయాలు
నెల్లూరు మెడికవర్లో చికిత్స పొందుతున్న కిరణ్ను పరామర్శించి
కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన చంద్రశేఖర్రెడ్డి
ఈ తెల్లవారుజామున నెల్లూరు జిల్లా నార్త్ రాజుపాలెం హైవేపై బస్సును లారీ డీకొట్టడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వైస్సార్సీపీ నాయకులు ఫిరంగి బాబు రావు అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన కుమారుడు కిరణ్ కుమార్ తీవ్రంగా గాయపడి నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు. ఈవిషయం తెలుసుకున్న వైసీపీ నగర ఇన్ఛార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పర్యవేక్షించారు. చికిత్స పొందుతున్న కిరణ్కుమార్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మేనేజ్మెంట్ను ఫోన్లో సంప్రదించి.. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాబూరావుకు పోస్ట్మార్టం పూర్తిచేయించి కుటుంబ సభ్యులకకు అప్పగించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని.. ఎవరూ అధైర్యపడొద్దని ఈసందర్భంగా పర్వతరెడ్డి వారికి ధైర్యం చెప్పారు. చంద్రశేఖర్రెడ్డి వెంట..
వైసీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, నాయకులు అశోక్, లోకేష్, వెంకట్, ఖాదర్, చంద్ర, ప్రసన్న, మీరా, పెంచలయ్య, ప్రసాద్ తదితరులున్నారు.