అగ్రిగోల్డ్ ఆస్తుల విలువపై చేస్తున్న సర్వే కాలయాపన కాకుండా చూడాలి
కావలిలో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం
ప్రభుత్వానికి పలు సూచనలు చేసిన అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తిరుపతి రావు
అగ్రిగోల్డ్ కేసును ప్రత్యేక కేసుగా చూడాలి…
- అగ్రిగోల్డ్ ఆస్తుల విలువపై చేస్తున్న సర్వే కాలయాపన కాకుండా చూడాలి
- కావలిలో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం
- ప్రభుత్వానికి పలు సూచనలు చేసిన అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తిరుపతి రావు
వలిలో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సమావేశంలో అసోసియేషన్ నేతలు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. అగ్రిగోల్డ్ కేసును ప్రత్యేక కేసుగా చూడాలని వారు కోరారు.
కోర్టుల్లో ఉన్న వేల కేసుల్లో అగ్రిగోల్డ్ ఒక కేసుగా కాకుండా ప్రత్యేక కేసుగా పరిగణించి బాధితులకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తిరుపతి రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కావలి పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ మూతపడి 11 సంవత్సరాలు అవుతుందన్నారు. సీపీఎం అండతో బాధితులకు, ఏజంట్లకు న్యాయం చేయాలని అసోసియేషన్ గా తాము ఎన్నో పోరాటాలు చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దృష్టి సారించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో, ఇతర ప్రాంతాల్లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ కట్టి వాటిని విక్రయించి లేదా, లీజులకు ఇచ్చి డబ్బులు కట్టిన బాధితులకు అందించాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వం చేస్తున్న సర్వే నిర్ధితమైన సమయానికి పూర్తి చేసేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్లూరి మాల్యాద్రి, అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. శంకరయ్య, జిల్లా అధ్యక్షుడు టి. సురేష్, జిల్లా ప్రచారకార్యదర్శలు రాధాకృష్ణ, జి మాల్యాద్రి రెడ్డి అగ్రిగోల్డ్ సంఘం కావాలి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.