అన్నవరం అవుట్ పోల్స్ దగ్గర నీటిని విడుదల చేసిన సోమశిల ప్రాజెక్టు
వైస్ చైర్మన్ ఫులిగుంట మధుమోహన్ రెడ్డి
సోమశిల కావలి కాలువకు 8.7 టీ ఎంసీల నీటి కేటాయింపు
ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు సూచన
సీబీఆర్ నుంచి సాగునీరు విడుదల
- అన్నవరం అవుట్ పోల్స్ దగ్గర నీటిని విడుదల చేసిన సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఫులిగుంట మధుమోహన్ రెడ్డి
- సోమశిల కావలి కాలువకు 8.7 టీ ఎంసీల నీటి కేటాయింపు
- ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు సూచన
సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఫులిగుంట మధుమోహన్ రెడ్డి చేతుల మీదుగా చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సీబీఆర్ దిగువ భాగానికి సాగునీటిని విడుదల చేశారు. ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన రైతులకి సూచించారు.
నెల్లూరు జిల్లా జలదంకి మండలం చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సీబీఆర్ దిగువ భాగానికి సాగునీటిని విడుదల చేశారు. సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఫులిగుంట మధుమోహన్ రెడ్డి చేతుల మీదుగా అన్నవరం అవుట్ పోల్స్ దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించి బ్రాహ్మణ క్రాక, గౌరవరం మేజర్ కాలువలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ నీటి కేటాయింపులకు సహకరించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కావ్య కృష్ణారెడ్డి లకు వారు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఇద్దరు ఎమ్మెల్యేలు కావలి కాలువలో 3.50 కోట్ల రూపాయలతో పూడిక, మరమ్మతుల పనులు చేయించారన్నారు. రైతులు అధికారుల సూచనల మేరకు నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్నవరం మర్రిమను చెరువు, జలదంకి పెద్ద చెరువు, టెంకవారిపాలెం చెరువు, లేదోటగంగమ్మ చెరువు, ఎల్లారు అగ్రహారం చెరువు లకు నీటిని నింపీ 12 వేల ఎకరాలకు నీటిని విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఈ శరత్ కుమార్, ఏ ఈ నాగార్జున రెడ్డి, గౌరవరం మేజర్ డిఈ మధుసూదన్ రావు, ఏఈ శ్రీ వర్ధన్, సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఫులు గుంట మధుమోహన్ రెడ్డి, సిబిఆర్ ప్రెసిడెంట్ పూనూరు భాస్కర రెడ్డి, ఒంటేరు జయచంద్ర రెడ్డి, డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్ పులిమ్ విజయభాస్కర్ రెడ్డి, గౌరవరం మేజర్ అధ్యక్షులు పూనం మల్లారెడ్డి, బ్రాహ్మణక్రాక మేజర్-3 అధ్యక్షులు వేలమూరి పాండురంగారెడ్డి, బ్రాహ్మణక్రాక మేజర్ -2 అధ్యక్షులు చిత్తం శ్రీనివాసులు రెడ్డి, ముచాల మధు రెడ్డి , సిబిఆర్ కింద బ్రాహ్మణక్రాక, గౌరవరం మేజర్ ఆయకట్టు రైతులు తదితరులు పాల్గొన్నారు.