బార్ కు ..త్రిముఖ పోటీ..!

నెల్లూరు బార్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జూన్ 20న‌ – బ‌రిలోకి దిగిన మూడు ప్యాన‌ళ్లు

నామినేష‌న్లు దాఖ‌లు చేసిన 39 మంది న్యాయ‌వాదులు

ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా మొద‌లు పెట్టిన ప్ర‌చారం

బార్ కు ..త్రిముఖ పోటీ..!
నెల్లూరు బార్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జూన్ 20న‌
బ‌రిలోకి దిగిన మూడు ప్యాన‌ళ్లు
నామినేష‌న్లు దాఖ‌లు చేసిన 39 మంది న్యాయ‌వాదులు

ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా మొద‌లు పెట్టిన ప్ర‌చారం

నెల్లూరు బార్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జూన్ 20వ తేదీ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో..మూడు ప్యాన‌ళ్లు పోటీ ప‌డుతుండ‌టంతో.. త్రిముఖ పోటీ అయ్యింది. ప్ర‌ముఖంగా జాతీయ న్యాయ‌వాద వేదిక‌, న్యాయ‌వాదుల ఐక్యవేదిక‌ ప్యాన‌ల్‌, …వీసీఎస్ఆర్‌- వేనాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ప్యాన‌ల్ రంగంలోకి దిగాయి. ఈ ఎన్నిక‌ల్లో భాగంగా.. గురువారం నెల్లూరు కోర్టు ఆవ‌ర‌ణంలో నామినేష‌న్‌ల ప్ర‌క్రియ మొద‌లై సాయంత్రానికి ముగిసింది. ఈ మూడు ప్యాన‌ళ్ల‌కు సంబంధించిన అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శి, ఇత‌ర ఈసీ మెంబ‌ర్లు మొత్తం 39 మంది త‌మ నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. వాట‌న్నింటినీ ఎల‌క్ష‌న్ అధికారులు పరిశీలించి.. ఆమోదించారు. ఈ త్రిముఖ పోరులో.. జాతీయ న్యాయ‌వాదుల ఐక్య వేదిక ప్యానల్‌లో అధ్యక్షుడిగా దాస‌రి రాజేంద్ర‌ప్ర‌సాద్‌, వైస్ ప్రెసిడెంట్‌గా బి.ఎస్‌. రంగ‌రాజ‌న్‌, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా సీహెచ్‌. న‌వీన్‌రెడ్డి, జాయింట్ సెక్ర‌ట‌రీగా తాండ్ర బాబురెడ్డి, ట్రెజ‌ర‌ర్‌గా పీ.జీ. మ‌హేష్‌, స్పోర్ట్స్ అండ్ క‌ల్చ‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా పేటేటి భాస్క‌ర్‌రావు, లైబ్ర‌రీ సెక్ర‌టరీగా నాగ శ్రీ‌నివాస్ నెల‌పాటి, లేడీ రిప్ర‌జెంటీవ్‌గా బాశం కృష్ణ‌వేణి, సీనియ‌ర్ ఈసీ మెంబ‌ర్లుగా టి. సాయి శ్రీ‌నివాస్‌రెడ్డి, దండు ముర‌ళీమోహ‌న్‌రెడ్డి, సందూరు ఏడుకొండ‌లు, జూనియ‌ర్ ఈసీ మెంబ‌ర్లుగా కాకు ముర‌ళీరెడ్డి, అచ్చి రామాంజ‌నేయులు, దేవూరు మ‌ల్లిఖార్జున‌, అర్ఫానా షేక్‌, యాళ్ల దేవీ ప్ర‌సన్న…

అలాగే.. న్యాయ‌వాదుల ఐక్య ప్యాన‌ల్‌లో.. ప్రెసిడెంట్‌గా వి. ఉపేంద్ర‌రావు, వైస్ ప్రెసిడెంట్‌గా జ‌ల్లి ప‌ద్మాక‌ర్‌, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఎస్‌. అంక‌య్య‌, జాయింట్ సెక్ర‌టీగా ర‌వికృష్ణ నాగెళ్ల‌, లేడీ రిప్ర‌జెంటీవ్‌గా బి. ల‌క్ష్మీ, ట్రెజ‌ర‌ర్‌గా డి. పెంచ‌ల ప్ర‌ణీత్ రెడ్డి, స్పోర్ట్స్ అండ్ క‌ల్చ‌ర‌ల్ సెక్ర‌టరీగా స‌య్య‌ద్ వ‌సీమ్‌, లైబ్ర‌రీ సెక్ర‌ట‌రీగా షేక్‌. ర‌షీద్‌, సీనియ‌ర్ ఎగ్జిక్యూటీవ్ మెంబ‌ర్లుగా.. కె. కొండ‌ల‌రావు, ఎస్‌. న‌వీన్‌కుమార్‌, చ‌లువాది జితేంద్ర‌, జూనియ‌ర్ ఈసీ మెంబ‌ర్లుగా.. చేవూరి శ్రీ‌ధ‌ర్‌, కందాడి రాజ‌గోపాల్‌, సుద్దుప‌ల్లి హ‌రికృష్ణ‌, జువ్వ‌ల రాఘ‌వ‌య్య‌, బండ్ల మ‌మ‌త..

ఇక‌.. వీసీఎస్ఆర్ ప్యాన‌ల్‌లో.. ప్రెసిడెంట్‌గా అయ్య‌ప్ప రెడ్డి పులిమి, వైస్ ప్రెసిడెంట్‌గా భాస్క‌ర‌య్య ఈదూరు, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా నాగ‌రాజు న‌క్క‌ల‌, జాయింట్ సెక్ర‌ట‌రీగా కె. ల‌క్ష్మీనారాయ‌ణ‌, లైబ్ర‌రీ సెక్ర‌ట‌రీగా ఎండీ. ముజీబుర్ రెహ్మ‌న్‌, ట్రెజ‌ర‌ర్‌గా ఆర్‌. శివ‌శంక‌ర్‌రావు, స్పోర్ట్స్ అండ్ క‌ల్చ‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా జి. చంద్ర‌శేఖ‌ర్‌నాయుడు, లేడీ రిప్ర‌జెంటీవ్‌గా పి. ర‌మాదేవి, సీనియ‌ర్ ఈసీ మెంబ‌ర్లుగా.. ఎ. చంద్ర‌శేఖ‌ర్ గుప్తా, పి. గంగ‌రాజు, వి. సారిక‌, జూనియ‌ర్ ఈసీ మెంబ‌ర్లుగా.. విస్సా మ‌హేశ్వ‌రి, జి. ఉపేంద్ర‌రెడ్డి, పి. వెంక‌టేశ్వ‌ర్లు, ష‌హ‌మీర్ షేక్‌, స‌య్య‌ద్ క‌షీప్‌లు ఈ బార్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారు. వ‌చ్చేనెల 20వ తేదీన ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల‌వ‌ర‌కు కొన‌సాగుతుంది. ఈ ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ఇప్ప‌టి నుంచే ఆయా ప్యాన‌ళ్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం సైతం మొద‌లు పెట్టేయ‌డం విశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *