టీడీపీ కార్యకర్తలకు అతి పెద్ద పండుగ..మహానాడు

తెలుగువారి ఆత్మగౌరవం కాపాడాలనే ఎన్టీఆర్ పార్టీ పెట్టారు – కాకినాడ మహానాడులో ఇన్చార్జి మంత్రి నారాయణ – జిల్లా మహానాడు కు హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యే లు,ఎమ్మెల్సీ లు,ఇతర టీడీపీ నేతలు

టీడీపీ కార్యకర్తలకు అతి పెద్ద పండుగ..మహానాడు

  • తెలుగువారి ఆత్మగౌరవం కాపాడాలనే ఎన్టీఆర్ పార్టీ పెట్టారు
  • కాకినాడ మహానాడులో ఇన్చార్జి మంత్రి నారాయణ
  • జిల్లా మహానాడు కు హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యే లు,ఎమ్మెల్సీ లు,ఇతర టీడీపీ నేతలు


కాకినాడలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్సేలు, టీడీపీ నేతలతో కలసి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.


ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా జరుపుకునే మహానాడు టీడీపీ కార్యకర్తలకు అతి పెద్ద పండుగ అని…రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఆయన ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహానాడు సభలో మంత్రి నారాయణ ప్రసంగించారు. ప్రతి ఒక్కరికి కూడు,గుడ్డ,నీడ ఉండాలనే లక్ష్యంతో స్థాపించారన్నారు. జిల్లా మహానాడు తీర్మానాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. గత ఐదేళ్లలో వచ్చిన సమస్యలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ రాలేదని గుర్తు చేశారు. ఇన్ని ఇబ్బందులు పెట్టినా జనసేన, బీజేపీతో కలిసి మళ్ళీ అధికారంలోకి వచ్చామని…జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తప్పించారన్నారు. కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కాకినాడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *