ఆక్రమణలో దొరువు

ఇందుకూరుపేటలో రెచ్చిపోతున్న భూకబ్జాదారులు

కబ్జాదారుల నుంచి దొరువుని కాపాడాలంటున్న గ్రామస్థులు

ఆక్రమణలో దొరువు….

  • ఇందుకూరుపేటలో రెచ్చిపోతున్న భూకబ్జాదారులు
  • కబ్జాదారుల నుంచి దొరువుని కాపాడాలంటున్న గ్రామస్థులు


డేవిస్పేటలోని దొరువుని కొందరు భూ కబ్జాదారులు ఆక్రమించేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించిన ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.


నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని డేవిస్ పేట సమీపంలో ఉన్న దొరువును అదే గ్రామానికి చెందిన భూ కబ్జాదారులు ఆక్రమిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు..ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ…దొరువు సమీపంలో ఉన్న దేవస్థాన భూమి సాగు చేసుకుంటున్న నెల్లూరు రమణయ్య అనే వ్యక్తి అతని పొలంలో ఉన్న మట్టి ద్వారా పక్కనే ప్రభుత్వానికి సంబంధించిన దొరువును కొంచెం కొంచెం పూడ్చుకుంటూ ఆక్రమిస్తున్నాడన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు పలుమార్లు వినతి పత్రం అందజేసిన ఎటువంటి ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కబ్జాదారుల నుంచి దొరువును కాపాడాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *