రాబోయే విజయ దశమికి

అమరావతిలో విశాఖ మెట్రో డెవలప్మెంట పై మంత్రి నారాయణ సమీక్ష

మంత్రి నారాయణ

రాబోయే విజయ దశమికి…

  • మంత్రి నారాయణ
  • అమరావతిలో విశాఖ మెట్రో డెవలప్మెంట పై మంత్రి నారాయణ సమీక్ష


విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్టోబర్ నెలలో మెట్రో పనులు ప్రారంభం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.


ప్రతీ నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్న ఆకాంక్షతోనే ఆనాడు నిర్మాణం చేపట్టామని..గత ప్రభుత్వం ఆ పథకాన్ని నాశనం చేసిందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాబోయే విజయ దశమికి కొన్ని ఇల్లులు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అమరావతిలో విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్ పునః సమీక్ష, అభివృద్ధి ప్రాజెక్టులు, మెట్రో రైలుపై చర్చించారు. అక్టోబర్ నెలలో మెట్రో పనులు ప్రారంభం చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *