ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
జాతరలా కోవూరు మినీ మహానాడు
లంచాలు లేని కోవూరు సాధించడమే తీర్మానం
ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
సీఎం చంద్రబాబు అనుభవమే
రాష్ట్రాన్ని కాపాడుతోంది..!
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
జాతరలా కోవూరు మినీ మహానాడు
లంచాలు లేని కోవూరు సాధించడమే తీర్మానం-ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
పసుపు జెండా రెపరెపలాడింది. కనుచూపుమేర పసుపు సైనికులతో కిక్కిరిసిపోయింది. కోవూరు నియోజకవర్గ మినీ మహానాడు జన జాతరను తలపించింది. మంగళవారం రాత్రి కోవూరులోని ఓ కల్యాణమండలంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి మినీ మహానాడులో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోలంరెడ్డి దినేష్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా సభా ప్రాంగణానికి చేరుకున్న నేతలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేదికపై నందమూరి తారకరామారావు విగ్రహానికి నివాళులు అర్పించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి సభాధ్యక్షత వహించి కోవూరు నియోజకవర్గానికి సంబంధించి పలు తీర్మానాలను ఆమోదింపజేశారు.
ఈ సందర్బంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాక్రెడ్డి మాట్లాడుతూ.. అత్యంత క్రమశిక్షణకు మారుపేరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆని, ఆయనకున్న అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారన్నారు. కేంద్రంలో సీఎంకు ఉన్న పరపతితో రాష్ట్రo ఇబ్బందుల నుంచి గట్టెక్కుతోందన్నారు. ప్రతి ఒక్కరికీ తగిన ప్రాధాన్యత ఇవ్వడం సీఎంకే సాధ్యమైందన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు తన వద్దకు వస్తామన్న ..తానే వారి కార్యాలయాలకు వెళ్లి రాష్ట సమస్యల గురించి చర్చించడం చంద్రబాబు గొప్పతనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని వివరించారు. సీఎం చంద్రబాబు విజన్ చూసి కేంద్ర మంత్రులే ఆశ్చర్యపోతారని చెప్పారు. దగదర్తి విమానాశ్రయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిధులు కూడా మంజూరు అవుతున్నాయన్నారు. జూన్ నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖభవ పథకాలు అమలు చేయనున్నారని చెప్పారు. నెల్లూరు నుంచి కడప మహానాడుకు వచ్చే వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అంతకు ముందు లంచాలు లేని కొవూరుగా తీర్చిదిద్దాడమే లక్యం గా తీర్మానించారు