పదవులు శాశ్వతం కాదు. – ప్రజా సంక్షేమంలో రాజీ పడం.
ప్రతి ఒక్కరికీ తోడుంటాం.. ఆపదలో ఆదుకుంటాం
కోవూరు నియోజకవర్గ మినీ మహానాడులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
ప్రజా సేవ చేయడం కోసమే మేం రాజకీయాల్లోకి వచ్చాం..!!
పదవులు శాశ్వతం కాదు.
ప్రజా సంక్షేమంలో రాజీ పడం.
ప్రతి ఒక్కరికీ తోడుంటాం.. ఆపదలో ఆదుకుంటాం
కోవూరు నియోజకవర్గ మినీ మహానాడులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటిదని, ఎమ్మెల్యేగా తనను భారీ మెజార్టీతో గెలిపించిన కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. కోవూరులో జరిగిన నియోజకవర్గ మినీ మహానాడులో ఆమె మాట్లాడారు. ‘కొత్త పాత.. కలయికతో ప్రయాణం చేసేటప్పుడు పార్టీలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. వైసీపీలో ఉన్న అబ్దుల్ అజీజ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పార్టీ కోసం ఎలా కష్టపడ్డారు, ఏ పార్టీ నుంచి వచ్చారని కాదు.. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేయడమే లక్ష్యం కావాలని ఈ సందర్బంగా ఆమె అన్నారు. పార్టీని గౌరవించాలి, పార్టీ సిద్ధాంతాలు పట్ల నిబద్ధతగా పని చేయాలి, గ్రామ సమస్యలపై అవగాహన పెంచుకోవాలి. స్థానిక నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో చిత్తశుద్ధితో కృషి చేయాలి అని వివరించారు.