పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి

టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

20 మందికి రూ. 19 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన కోటంరెడ్డి

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి

  • టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
  • 20 మందికి రూ. 19 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన కోటంరెడ్డి


నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఒక వరం అని రూరల్ టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. 20 మంది లబ్ధిదారులకి రూ. 19 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన అందచేశారు.


నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో…నియోజకవర్గంలోని 20 మందికి మంజూరైన రూ.19లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ….ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సలు పొందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో వైద్యం పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం అని చెప్పారు. పేదల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉదారంగా సాయం మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి పేద ప్రజల తరపున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. కార్యక్రమంలో రూరల్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *