నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు సంచ‌ల‌నం రేపే క‌థ‌నాలు

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని…ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన మెగా యోగాసాధనలో కలెక్టర్ ఆనంద్ పాల్గొని యోగాసనాలు చేశారు. అందరి జీవితాల్లో యోగా భాగమవ్వాలని ఆయన కోరారు.

2025 మహానాడును విజయవంతం చేయడంలో నెల్లూరు నేతలకు పెద్దపీఠ వేశారు. పలు కీలక విభాగాలలో పది మందికి అవకాశం కల్పిస్తూ అధిష్ఠానం జాబితాను విడుదల చేసింది.

మన్నారుపోలూరు పార్క్ ని అధికారులతో ఎమ్మెల్యే విజయశ్రీ పరిశీలించారు. త్వరితగతిన పార్కుని అందుబాటులోకి తీసుకు రావడమే కాక, మరిన్ని పార్కులు ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు.

శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శేష వాహనంపై స్వామి, అమ్మవార్లకు భక్తులకు దర్శనమిచ్చారు.

కావలి పీపీ యూనిట్ లో మృతి చెందిన రావినూతల సునీత మృతదేహాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సందర్శించారు. వైద్యులతో మాట్లాడి మృతికిగల కారణాలను ఆయన తెలుసుకున్నారు.

వెంకటాచలంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మినీ మహానాడు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో కలసి దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

సుష్మితపై భర్త, బావ అత్తలు కలసి దాడి చేయడం బాధాకరమని ఏపీ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మెండా శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

కావలి ఏరియా వైద్యశాలవద్ద విశ్రాంత వైద్యుడు కోటేశ్వర రావు హల్ చల్ చేశాడు. బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబం ముందే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. వెంటనే ఆయన్ని పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు.

సహాయం చేసేందుకు వచ్చి మృత్యువాత చెందిన సంఘటన కావలిలో చోటు చేసుకుంది. మృతుడు బాలకృష్ణరెడ్డినగర్ వాసి మద్దెల వెంకటేష్ గా గుర్తించారు. సీఐ గిరిబాబు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిట్టేడు గ్రామంలో వాకాడు సీఐ హుస్సేన్ బాషా పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కోట ఎస్ఐ పవన్ కుమార్ తో కలసి ఆయన ఎస్బీటీ కాలనీ వాసులతో మమేకమయ్యారు. ప్రజలకి పలు సూచనలు, సలహాలు చేశారు. వేసవిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో వరినాట్లు జోరందుకున్నాయి. రెండో పంటకు నీరు ఇవ్వడంతోపాటు బోర్లపై ఆధారపడి సేద్యం చేసే ఈ మండలంలో ఇప్పుడు ఎక్కడ పట్టినా బెంగాలీ కూలీల గురించే చర్చించుకుంటున్నారు. కూలీలు తక్కువగా ఉండడం, క్రమపద్దతిలో నాట్లు వేయడం, దిగుబడి ఎక్కువగా రావడం ఇలా అనేక ప్రయోజనాలున్న నేపథ్యంలో బెంగాలీ కూలీల వైపు మొగ్గు చూపుతున్నామని రైతులు తెలుపుతున్నారు. వరి రైతులకు వరంలా మారిన బెంగాలీ కూలీలపై ఎన్3 గ్రౌండ్ రిపోర్ట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *