అవినీతి రహిత కొవూరే మా లక్ష్యం
నాతో నడిచిన ఏ కార్యకర్తకూ అన్యాయం జరగదు
కోవూరు మినీ మహానాడులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
ఇసుక తవ్వుకుంటాం
గ్రావెల్ దోచుకుంటాం అంటే కుదరదు..!
అవినీతి రహిత కొవూరే మా లక్ష్యం
నాతో నడిచిన ఏ కార్యకర్తకూ అన్యాయం జరగదు
కోవూరు మినీ మహానాడులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
కేవలం ప్రజాసేవ చేయడం కోసమే తాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చామని.. ఎమ్మెల్యే అన్నారు. అవినీతిరహిత, వివాదరహిత కోవురే మా లక్ష్యం అని..ఎక్కడ ఒక రూపాయి ఆశించకుండా స్వచ్ఛంగా ప్రజలకు సేవలు అందిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. కోవూరులో జరిగిన మినీ మహానాడులో వేమిరెడ్డి మాట్లాడారు. పార్టీలకతీతంగా ప్రజా సేవ చేస్తున్నాం. తప్పు ఎవరు చేసినా తప్పే.. అది ప్రతిపక్షమా స్వపక్షం అని చూడం. మాకు తెలిసిందల్లా ప్రజలకు మంచి చేయడమే. ఏ కార్యకర్తను ఏ నాయకుడిని నేను విస్మరించను. మీ సేవలను గుర్తిస్తాను. కోవూరు నియోజకవర్గంలో ప్రతి నాయకుడికి కార్యకర్తకి అండగా ఉంటాం. నాతో కలిసి నడిచిన ఏ నాయకుడికి అన్యాయం జరగదు. పదవులు శాశ్వతం కాదు. ప్రతి ఒక్కరికి దశలవారీగా పదవుల్లో అవకాశం కల్పిస్తాను. ఇసుక దోచుకోవటం గ్రావెల్ తోలుకుంటామంటే కుదరదు.. అక్రమాలకు నేను సహకరించను అని కుండ బద్దలు కొట్టారు.
పదవులు పొందాలని చాలామందికి ఆశ ఉంటుంది, ఉండేది ఐదు పదవులు అందరికీ న్యాయం చేయలేను. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు గతంలో మండల అధ్యక్షులుగా పనిచేసి పార్టీ విజయం కోసం కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. పాత కొత్త నాయకులు సమన్వయంతో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలి. చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్బంగా ఆమె పిలుపునిచ్చారు.