కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం సమర్పించిన సీపీఎస్ ఈఏ రాష్ట్ర, జిల్లా నాయకులు
సీపీఎస్ను రద్దు చేయాలి
పాత విధానాన్ని కొనసాగించాలి
కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం సమర్పించిన సీపీఎస్ ఈఏ రాష్ట్ర, జిల్లా నాయకులు
ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సిపిఎస్ ఆధ్వర్యంలో,.. సీపీఎస్ ఈఏ రాష్ట్ర , జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ని కలిశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సిపిఎస్ ఉద్యోగులపై అక్రమంగా బనాయించిన కేసులను వెంటనే రద్దు చేయాలని, సిపిఎస్ ఉద్యోగులకు రావలసిన డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న డి.ఏలను,ఐ.ఆర్ లను వెంటనే ప్రకటించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘాల నేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ సిపిఎస్ ఈఏ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ బాజీ గారు మరియు కరిమి రాజేశ్వరరావు గారు సహా అధ్యక్షులు చీర్ల కిరణ్ కుమార్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హుస్సేన్ గారు నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఈ ధనరాజ్, పెంచలయ్య గార్లు నెల్లూరుజిల్లా టెక్నికల్ కమిటీ మెంబర్ సభ్యులు పాల్గొన్నారు.