నెల్లూరులో ఘనంగా కాశ్మీర్ ఎగ్జిబిషన్ ప్రారంభం

ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన మంత్రి నారాయణ కుమార్తె డాక్టర్ షరణి

నెల్లూరులో ఘనంగా కాశ్మీర్ ఎగ్జిబిషన్ ప్రారంభం…

  • ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన మంత్రి నారాయణ కుమార్తె డాక్టర్ షరణి

నెల్లూరు నగరం ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో కాశ్మీర్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు షరణి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.
కాశ్మీర్ వాతావరణం ఎలా ఉంటుందో అలానే నెల్లూరులో ఏర్పాటు చేసినందుకు నిర్వాహకుల్ని ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.
వేసవి సెలవుల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ఎగ్జిబిషన్ అవసరమన్నారు. కుటుంబ సభ్యులతో పాటు పిల్లలతో ఈ ఎగ్జిబిషన్ కి వస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని షరణి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *