కుప్పంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సుమిత్ కుమార్
గంగమాంబ జాతరకి సీఎం రాక…
- కుప్పంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సుమిత్ కుమార్
తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొని అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా జాతర ఏర్పాట్లను కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులతో కలసి పరిశీలించారు.
చిత్తూరు జిల్లా కుప్పం తిరుపతి గంగమాంబ జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. ఈ నెల 21న గంగమాంబ అమ్మవారిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దర్శించుకోనున్నారు. జాతరతోపాటు… సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలసి కలెక్టర్ పరిశీలించారు. ప్రశాంతంగా జాతర జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆయన ఆదేశించారు. కలెక్టర్ వెంట పలు శాఖల అధికారులు ఉన్నారు.