కష్టం చేసే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా

రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

భారీగా తరలి వచ్చిన తెలుగు తమ్ముళ్లు

దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

రూరల్ మినీ మహానాడులో అభివృద్ధి పనులపై 12 ప్రతిపాదనలు

కష్టం చేసే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా

  • రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
  • భారీగా తరలి వచ్చిన తెలుగు తమ్ముళ్లు
  • దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
  • రూరల్ మినీ మహానాడులో అభివృద్ధి పనులపై 12 ప్రతిపాదనలు


నెల్లూరురూరల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు నిర్వహించారు. మహానాడుకి పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు తరలి వచ్చారు. దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి పాల్గొన్నారు. దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహానాడులో అభివృద్ధి పనులపై 12 ప్రతిపాదనలు చేశారు. తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. మహానాడుని ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రసంగించారు. కార్యకర్తల శ్రమతోనే టీడీపీ గెలుపు సాధ్యమైందన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా నన్ను నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారన్నారు. జనంకి జవాబుదారీగా ఉందామన్నారు. కష్టం చేసే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటానని హామీ ఇచ్చారు. చేజర్ల మాట్లాడుతూ….భవిష్యత్తులో నెల్లూరు రూరల్ కు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జులు, కో క్లస్టర్ ఇంచార్జులు, కార్పొరేటర్లు, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *