వరి రైతులకు వరంలా మారిన బెంగాలీ కూలీలు
ఇందుకూరుపేట వరిసాగులో వీరికి ప్రత్యేక గుర్తింపు
మిషన్ను పోలిన వరినాట్లు వేస్తున్న కూలీలపై ఎన్3 గ్రౌండ్ రిపోర్ట్
ఎన్ని మిషన్లు ఉన్నా…వారికి సాటి రావు…
- వరి రైతులకు వరంలా మారిన బెంగాలీ కూలీలు
- ఇందుకూరుపేట వరిసాగులో వీరికి ప్రత్యేక గుర్తింపు
- మిషన్ను పోలిన వరినాట్లు వేస్తున్న కూలీలపై ఎన్3 గ్రౌండ్ రిపోర్ట్
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో వరినాట్లు జోరందుకున్నాయి. రెండో పంటకు నీరు ఇవ్వడంతోపాటు బోర్లపై ఆధారపడి సేద్యం చేసే ఈ మండలంలో ఇప్పుడు ఎక్కడ పట్టినా బెంగాలీ కూలీల గురించే చర్చించుకుంటున్నారు. కూలీలు తక్కువగా ఉండడం, క్రమపద్దతిలో నాట్లు వేయడం, దిగుబడి ఎక్కువగా రావడం ఇలా అనేక ప్రయోజనాలున్న నేపథ్యంలో బెంగాలీ కూలీల వైపు మొగ్గు చూపుతున్నామని రైతులు తెలుపుతున్నారు. వరి రైతులకు వరంలా మారిన బెంగాలీ కూలీలపై ఎన్3 గ్రౌండ్ రిపోర్ట్.
ఆధునిక సమాజంలో అన్నీ రంగాలతోపాటు వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీ రాజ్యమేలుతున్న నేటి కాలంలో యంత్రాలను పక్కన పెట్టి మరీ…కూలీలుగా వారికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. పొలం దుక్కి చేయడం నుంచి వరికోత కోసి ఒడ్లు ఆరబెట్టే వరకు రకరకాల యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో సాంప్రదాయ పద్దతులే సేద్యానికి దిక్కుగా మారుతున్నాయి.
వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న జిల్లా నెల్లూరు…. ఇందులోనూ వరి సేధ్యం కూడా ఎక్కువగా మన జిల్లాలో ఉంది. అయితే కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో మిగతా మండలాలకు కాస్త భిన్నంగా ఇటు వరితోపాటు…మరో వైపు ఉద్యాన, వాణిజ్య పంటలు కూడా పండిస్తుంటారు. ఎన్ని రకాల పంటలు పండించినా…సంవత్సరంలో రెండు కార్లు, మరి కొందరైతే మూడు కార్లు కూడా వరిని సాగు చేయడం ఇందుకూరుపేట మండలం ప్రత్యేకత.
అయితే ఈ వివరణ మొత్తం చెప్పడానికి కారణం ఏమిటంటే…రెండో కారు పంటకి ఇందుకూరుపేట మండలంలో వరి మడులు సిద్ధమై వరినాట్లు ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాన సమస్యగా ఉన్న కూలీల కొరత తీర్చేందుకు కొందరు రైతులు వెస్ట్ బెంగాల్ కూలీలను రంగంలోకి దించారు. అలనాటి పాత పాటలు ఆలపిస్తూ…వరినాట్లు వేసే స్థానిక మహిళలకు ప్రత్యాయ్నామంగా ఈ బెంగాలీ కూలీలు ప్రస్తుతం ఎక్కడ పట్టినా వరి పొలాల్లో దర్శనమిస్తున్నారు. స్థానిక కూలీలకు, బెంగాలీ కూలీలకు మధ్య అనేక వ్యత్యాసాలు ఉండడంతో రైతులు బెంగాలీ కూలీల వైపే మొగ్గు చూపుతున్నారు.