ఆక్ర‌మించిన ప్ర‌భుత్వ భూముల‌ను స్వాదీనం చేసుకుంటాం

వాటిని ప్ర‌జాప్ర‌యోజ‌న‌కరంగా మారుస్తాం

అభివృద్ధి ప‌నుల‌పై అధికారులు, కాంట్రాక్ట‌ర్లు, నాయ‌కుల‌తో మంత్రి నారాయ‌ణ సుదీర్ఘ స‌మీక్ష‌

ఆక్ర‌మించిన ప్ర‌భుత్వ భూముల‌ను స్వాదీనం చేసుకుంటాం
వాటిని ప్ర‌జాప్ర‌యోజ‌న‌కరంగా మారుస్తాం
అభివృద్ధి ప‌నుల‌పై అధికారులు, కాంట్రాక్ట‌ర్లు, నాయ‌కుల‌తో

మంత్రి నారాయ‌ణ సుదీర్ఘ స‌మీక్ష‌

రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయ‌ణ సోమ‌వారం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు న‌గ‌ర అభివృద్ధిపై అధికారులు, కాంట్రాక్ట‌ర్లు, పార్టీ నేత‌లు, కోఆర్డినేట‌ర్‌ల‌తో స‌మీక్షల‌తో బిజీబిజీగా ఉన్నారు. నెల్లూరు కార్పోరేష‌న్ ప‌రిధిలో జ‌రుగుతున్న‌, జ‌ర‌గ‌నున్న అభివృద్ధి ప‌నులపై సుదీర్ఘంగా చ‌ర్చించారు. అధికారులు, పార్టీ నేత‌ల అభిప్రాయాలు తీసుకున్నారు. ఆయ‌న అనేక సూచ‌న‌లు, స‌ల‌హాలిచ్చారు. అలాగే.. రెవెన్యూ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టానిఇ ఈసంద‌ర్భంగా మంత్రి అధికారుల‌కు ఆదేశించారు. ప్ర‌భుత్వ భూములు ఆక్ర‌మించాల‌న్న ఆలోచ‌న మానుకోవాల‌న్నారు. ఆక్ర‌మ‌ణ‌లో ఉన్న ప్ర‌భుత్వ భూముల‌ను తిరిగి స్వాదీనం చేసుకుంటామ‌ని, వాటిని ప్ర‌జా ఉప‌యోగ‌క‌రంగా మారుస్తామ‌న్నారు. త్వ‌ర‌లోనే సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నులు పూర్తి చేస్తామ‌న్నారు.
రాష్ట్రంలో 68 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం అన‌ర్హుల కార్డులు మాత్ర‌మే తొల‌గించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. అర్హ‌త ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందుతాయ‌న్నారు. ఈ స‌మీక్ష‌లో కార్పొరేషన్ కమీషనర్ నందన్ ,మాజీ మున్సిపల్ చైర్పెర్సన్ తాళ్ళపాక అనూరాధ ,మాజీ జెడ్పిటీసీ విజేతా రెడ్డి , టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు ,టీడీపీ డివిజన్ ఇంచార్జిలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *