వేమిరెడ్డి నిర్ణయం క‌రెక్టేనా

నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మార్కు రాజ‌కీయం సాధ్యమేనా..?

కోవూరులో టీడీపీ బ‌లోపేతం కోస‌మే ఆ నిర్ణం తీసుకున్నారా..?

పొలిట్‌బ్యూరో ఆదేశంతోనే వారికి అవ‌కాశం ద‌క్కలేదా..?

మండ‌ల కొత్త అధ్యక్షుల నియామ‌కంపై అక్కసుతోనే..

వారు ఆరోప‌ణ‌లు చేస్తున్నారా..? – కోవూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రుగుతుంది

నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మార్కు రాజ‌కీయం సాధ్యమేనా..?

  • కోవూరులో టీడీపీ బ‌లోపేతం కోస‌మే ఆ నిర్ణం తీసుకున్నారా..?
  • పొలిట్‌బ్యూరో ఆదేశంతోనే వారికి అవ‌కాశం ద‌క్కలేదా..?
  • మండ‌ల కొత్త అధ్యక్షుల నియామ‌కంపై అక్కసుతోనే..
  • వారు ఆరోప‌ణ‌లు చేస్తున్నారా..?
  • కోవూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రుగుతుంది

కోవూరు నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీ బ‌లోపేతం దిశ‌గా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అడుగులు వేస్తున్నారు. రాజ‌కీయాల‌కు కొత్తైనా.. ఎన్నిక‌ల అనంత‌రం ఆమె పూర్తిస్థాయి రాజ‌కీయ నేత‌గా.. ప‌రిణితి చెందిన ఎమ్మెల్యేగా మారిపోయారు. నేత‌ల‌కు, ప్రజ‌ల‌కు అందుబాటులో ఉంటూ.. గ్రామాల్లో నిత్యం ప‌ర్యటిస్తూ.. స్థానిక స‌మ‌స్యల‌కు త‌క్షణ ప‌రిష్కారానికి చ‌ర్యలు తీసుకుంటున్నారు. త‌న సొంత నిధుల‌తోపాటు వీపీఆర్ ఫౌండేష‌న్ పేరుతో నియోజ‌క‌వ‌ర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల‌తోపాటు నిరుద్యోగ యువ‌త‌కు జాబ్ మేళాలు ఏర్పాటు చేయ‌డంతోపాటు త‌న ప్రజ‌లు ఆరోగ్యంగా ఉండాల‌న్న ల‌క్ష్యంతో వైద్య శిబిరాలు, క్యాన్సర్ స్క్రీనింగ్ ప‌రీక్షలు వంటి కార్యక్రమాల‌ను నిరంత‌రం చేప‌డుతూ.. ప్రజ‌ల్లో.. ప్రజ‌ల‌తో ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో పాత‌, కొత్త నేత‌ల‌ను క‌లుపుకుని వెళ్లడంతోపాటు.. పార్టీని న‌మ్మకుని ఉన్నవారికి ప్రాధాన్యత‌నిస్తూ..పార్టీ కోసం క‌ష్టప‌డి ప‌నిచేసే వారికి గుర్తింపునిస్తున్నారు. ముఖ్యంగా కోవూరు రాజ‌కీయాల్లో త‌న మార్కు రాజ‌కీయానికి శ్రీ‌కారం చుట్టారు.

నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బ‌లోపేతం కోసం.. ప్రభుత్వ సంక్షేమ‌, అభివృద్ధి కార్యక్రమాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లేందుకు చ‌ర్యలు చేప‌ట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యువ‌నేత లోకేష్‌బాబు, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అబ్ధుల్ అజీజ్‌ల స‌హ‌కారంతో.. తాజాగా కోవూరు నియోజ‌క‌వ‌ర్గంలోని మండ‌లాధ్యక్షుల‌ను నియ‌మించి.. తన మార్కు మ‌రోసారి చూపించారు. మండ‌లాధ్యక్షుల నియామ‌కంలో సామాజిక‌, యువ‌త‌, విద్యావంతులు, పార్టీకోసం క‌ష్టప‌డి ప‌నిచేయ‌డం, త‌దిత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని.. ఎంపిక చేశారు. అంతేకాకుండా.. ఇటీవ‌ల చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జ‌రిగిన పొలిట్‌బ్యూరో స‌మావేశంలోనూ ఓ నిర్ణయం తీసుకున్నారు. మండ‌ల అధ్యక్షులుగా గ‌తంలో మూడేళ్లు, అంత‌కు మించి ప‌నిచేసిన వారిని ఎంపిక చేయ‌వ‌ద్దని నిర్ణయం తీసుకోవ‌డంతో.. పాత వారికి అవ‌కాశం ఇవ్వాల‌ని ఎమ్మెల్యే భావించినా.. పార్టీ తీసుకున్న నిర్ణయంతో.. అవ‌కాశం లేకుండా పోయింది. కొత్తగా నియ‌మించిన వారి ద్వారానే రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లేలా ప్రశాంతిరెడ్డి ప్రణాళిక‌లు చేస్తున్నారు. ఈ కొత్త అధ్యక్షుల ఎంపిక‌లో.. అనేక ఆరోప‌ణ‌లు, విమ‌ర్శలు వ‌స్తున్నా.. చేస్తున్నా.. అలా చేసేవారికి అవ‌కాశం ద‌క్కలేద‌న్న అక్కసుతోనే ఇలా ప్రచారం చేస్తున్నార‌న్న చ‌ర్చ కూడా నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతోంది. కోవూరు నియోజ‌క‌వ‌ర్గంలోని మండ‌లాల నూత‌న అధ్యక్షులు ఎవ‌రు..? గ‌తంలో ఏం చేసేవారు..? పార్టీకి విధేయులా..? కాదా..? ఈ ఎంపిక క‌రెక్టేనా.. ఓ సారి ప‌రిశీలిద్దాం…

కోవూరు మండ‌ల అధ్యక్షుడిగా కొల్లారెడ్డి సుధాక‌ర్‌రెడ్డిని ఎన్నుకున్నారు. ఆయ‌న పార్టీకి విధేయుడు. అంతేకాకుండా.. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డికి ముఖ్య అనుచ‌రుడు.

అలాగే.. కొడ‌వ‌లూరు మండ‌ల అధ్యక్షుడు నాపా వెంక‌టేశ్వర్లునాయుడు. ఆయ‌న క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. రైతు కూడా.. మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల్లో కీల‌కంగా వ్యవ‌హ‌రించేవారు. ఉత్సాహ‌వంతుడు. ఆ సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్యత‌నివ్వాల్సిన క్రమంలో వెంక‌టేశ్వర్లునాయుడును ఎంపిక చేశారు.

ఇక‌.. విడ‌వ‌లూరు మండ‌ల అధ్యక్షుడిగా ఏటూరు శ్రీ‌హ‌రిరెడ్డిని నియ‌మించారు. ఆయ‌న అతి సామాన్యుడు. పార్టీకి విధేయుడు. అంద‌రితో స‌త్సంబంధాలు క‌లిగి.. పార్టీకి విధేయుడు. ఈ విధేయ‌తే ఆయ‌న ఎంపిక‌కు కార‌ణం అయ్యింది.

అలాగే.. ఇందుకూరు పేట మండ‌లం రెడ్డి వ‌ర్గ ప్రాబ‌ల్యం ఉన్న మండ‌లం. అక్కడ రెడ్డి వ‌ర్గానికి చెందిన‌వారిని పెట్టాల‌ని జిల్లాకు చెందిన ఓ రాష్ట్రస్థాయి నేత సూచ‌న‌తో ఏకొల్లు ప‌వ‌న్‌రెడ్డికి అవ‌కాశం ఇచ్చారు. గ‌తంలో 25 ఏళ్లపాటు యాద‌వ వ‌ర్గం, మ‌రో 12 ఏళ్లు క‌మ్మ సామాజిక వ‌ర్గం వారు అధ్యక్షులుగా ప‌నిచేశారు. టీడీపీ ఆవిర్భావం స‌మ‌యంలో ఇక్కడి నుంచి రెడ్డి స‌మాజిక వ‌ర్గం ప్రాతినిధ్యం వ‌హించింది. మ‌ళ్లీ ఇన్నాళ్లకు ప‌వ‌న్‌రెడ్డికి అవ‌కాశం ద‌క్కింది.

బుచ్చిరెడ్డిపాళెం మండ‌లానికి వ‌చ్చేస‌రికి.. దామ‌ర‌మ‌డుగుకు చెందిన బెజ‌వాడ జ‌గ‌దీష్ కు అవ‌కాశం క‌ల్పించారు. అతడు విద్యావంతుడు. వారి తాత‌లు, తండ్రులు.. మొన్నటి స‌ర్వత్రిక ఎన్నిక‌ల‌వ‌ర‌కు క‌మ్యూనిస్టు బ్యాక్ గ్రౌండ్‌. 2021 స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో మండ‌లంలో అన్ని చోట్లా వైసీపీ కైవ‌సం చేసుకున్నా.. దామ‌ర‌మ‌డుగులో ఫ్యాన్‌ను తిర‌గ‌నివ్వలేదు. స‌ర్పంచ్‌, ఎంపీటీసీ రెండూ కైవ‌సం చేసుకోవ‌డంలో జ‌గ‌దీష్ కుటుంబం కీల‌క‌పాత్ర పోషించింది. 2024 సార్వత్రిక ఎన్నిక‌ల‌కు ముందు వేమిరెడ్డి ఆహ్వానం మేర‌కు వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ప్రాంతంలో టీడీపీకి ఎప్పుడూ రాని మెజార్టీని వారు తీసుకొచ్చారు. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌దీష్ కు మండ‌లాధ్యక్షుడిగా అవ‌కాశం క‌ల్పించారు.

ఇక‌.. బుచ్చి టౌన్ గౌర‌వాధ్యక్షుడిగా గుత్తా శ్రీ‌నివాసులుని ఎంపిక చేశారు. ఈయ‌న విద్యార్థి ద‌శ నుంచి ఏబీవీపీ నేప‌థ్యం.. ఉపాధ్యాయుడు.. ఆ త‌ర్వాత‌.. ఉపాధ్యాయ సంఘ నేత‌.. సేవా కార్యక్రమాల్లో ముందుండేవారు.. రెండేళ్ల క్రితం వీఆర్ఎస్ ఇచ్చేశారు. వేమిరెడ్డి, నారాయ‌ణ ఆయ‌న్ను పార్టీలోకి తీసుకున్నారు. పార్టీకోసం క‌ష్టప‌డి ప‌నిచేస్తుండ‌డంతోపాటు బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత కావ‌డంతో.. బుచ్చి గౌర‌వాధ్యక్ష గౌర‌వం ద‌క్కింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *