రాష్ట్ర మంత్రి నారాయణ
నెల్లూరు నగరంలో భారీ తిరంగా ర్యాలీ
వెయ్యి అడుగుల త్రివర్ణ పతాకంతో ప్రదర్శన
భారత్ మాతాకీ జై..వందేమాతరం నినాదాలతో మారుమోగిన వీఆర్సీ సెంటర్
భారత్ తో పెట్టుకోవద్దు…
- రాష్ట్ర మంత్రి నారాయణ
- నెల్లూరు నగరంలో భారీ తిరంగా ర్యాలీ
- వెయ్యి అడుగుల త్రివర్ణ పతాకంతో ప్రదర్శన
- భారత్ మాతాకీ జై..వందేమాతరం నినాదాలతో మారుమోగిన వీఆర్సీ సెంటర్
ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని…నెల్లూరు నగరంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది ప్రజలు, కూటమి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని భారత్ మాతా జై అంటూ నినదించారు. వెయ్యి అడుగుల త్రివర్ణ ప్రదర్శన అందరిని ఆకట్టుకుది.
అమాయక ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను కోలుకోలేని దెబ్బ కొడతామని చెప్పిమరీ ముష్కరుల పీచమణిచిన భారత ప్రధానికి, సైన్యానికి దేశప్రజలు అండగా ఉండాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు.
నెల్లూరు నగరంలో వేలాది మంది ప్రజలు మనం సైతం దేశం కోసం అంటూ జాతీయ పతాకాలు చేతబూని భారత్ మాతాకీ జై అని నినదిస్తూ వీఆర్సీ సెంటర్ నుండి గాంధీ విగ్రహం వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. కూటమి పార్టీల నాయకులు తోడుగా యువకులు, విద్యార్థులు, మాజీ సైనికులు, వివిధ వర్గాల ప్రజలు వేయి అడుగుల త్రివర్ణ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. వందేమాతరం నినాదంతో వి ఆర్ సి సెంటర్ మార్మోగింది. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించిన త్రివిధ దళాల జవానులు అనిర్విచనీయమైన విజయం సాధించారని కొనియాడారు. తిరంగా ర్యాలీలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి ,జిల్లా సైనిక సంక్షేమ అధికారి హరికృష్ణ, మాజీ సైనికోద్యోగులు శ్యాంప్రసాద్, కళాధర్, రత్నయ్య, కూటమి నేతలు నూనె మల్లికార్జున్ యాదవ్, గనుకుల కిషోర్, అశేష ప్రజలు పాల్గొన్నారు.