రూ. 7 కోట్లతో కార్పొరేషన్ కి ఇచ్చిన స్వచ్చాంధ్ర కార్పొరేషన్
కాంపాక్టర్లను ప్రారంభించిన మంత్రి నారాయణ…
నెల్లూరొచ్చిన… కాంపాక్టర్స్
- రూ. 7 కోట్లతో కార్పొరేషన్ కి ఇచ్చిన స్వచ్చాంధ్ర కార్పొరేషన్
- కాంపాక్టర్లను ప్రారంభించిన మంత్రి నారాయణ…
ఏడు కోట్ల వ్యయంతో…చెత్తను తీసుకెళ్లే కాంపాక్టర్ వాహనాలను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కొనుగోలు చేసింది. ఆ వాహనాలను నెల్లూరు కార్పొరేషన్ కి ఇచ్చింది. ఈ సందర్భంగా కాంపాక్టర్ వాహనాలను రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాలను…ట్రిప్పుకు 32 టన్నుల చెత్తను తరలించనున్నాయని మంత్రి నారాయణ తెలియజేశారు. మంత్రి వెంట నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కమిషనర్ వైవో ఆనంద్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ రాష్ట్ర నేత ధర్మవరం సుబ్బారావు, టీడీపీ నగరాధ్యక్షుడు మామిడాల మధు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.