తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ విన్నపం
నెల్లూరు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ఆనంద్
కలెక్టర్ కు బాధితులు మొర…
- తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ విన్నపం
- నెల్లూరు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ఆనంద్
నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ ఆనంద్ నిర్వహించారు. వేదికకు వచ్చిన బాధితులు తమ సమస్యల్ని కలెక్టర్ కు మొర పెట్టుకున్నారు. వెంటనే తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ ఆయనకి వినతి పత్రాలు అందచేశారు. పరిష్కార వేదికకు వచ్చే ప్రతీ అర్జీని క్షుణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. గ్రీవెన్స్ కి వినతులు రిపీట్ కాకుండా చూడాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది, అర్జీదారులు పాల్గొన్నారు.