ఎన్డీఏ ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా యావత్ భారత దేశం మద్దతుగా నిలుస్తుంది.
ఎమ్మేల్యే ఇంటూరి నాగేశ్వరరావు
150 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ లో పాల్గొన్న ప్రజలు
ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యం
- ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
- కందుకూరులో 150 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొన్న ప్రజలు
ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా ర్యాలీలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతోపాటు బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేతపట్టి బోలో భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు హోరెత్తించారు.
నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహం నుండి బయలుదేరిన ర్యాలీ అంకమ్మ గుడి, పోస్ట్ ఆఫీస్ సెంటర్ అంబేద్కర్ కూడలి మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు సాగింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో పాటు బీజెపీ, జనసేన నాయకులు పాల్గొని జాతీయ జెండాలు చేతపట్టి బోలో భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సంద్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత్ సైన్యానికి యావత్ భారతీయులందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయంతో దేశ భద్రతపై నమ్మకం మరింత బలపడింది అని అన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ కు ఘన నివాళులు అర్పించారు.