చిత్తూరులో బీట్ ద హీట్
పాల్గొన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు
వేసవిలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలి
- చిత్తూరులో బీట్ ద హీట్
- పాల్గొన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు
చిత్తూరులో హీట్ ద బీట్ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు నిర్వహించారు. వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారు అవగాహన కల్పించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు…ప్రతీ నెలా మూడో శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా నగర పాలక సంస్థ పరిధిలో అధికారులు హీట్ ద బీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్ ముద, కమిషనర్ నరసింహ ప్రసాద్, చుడా చైర్మన్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వేసవిలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. అలాగే మొక్కలు నాటి పరిరక్షించడంతోపాటు పక్షులకు తాగునీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంహెచ్వో డాక్టర్ లోకేష్, మెప్మా సీఎమ్ఓ వెంకటరమణ, డ్వాక్రా మహిళలు, నగరపాలక సంస్థ కార్మికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.