ఆపరేషన్ సింధూర్ తో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసింది
ముత్తుకూరు కూటమి నాయకుల ఆధ్వర్యంలో తిరంగా యాత్ర
పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి, బీజేపీ, జనసేన నాయకులు
భారత్ చుక్కలు చూపించింది…
- ఆపరేషన్ సింధూర్ తో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసింది
- ముత్తుకూరు కూటమి నాయకుల ఆధ్వర్యంలో తిరంగా యాత్ర
- పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి, బీజేపీ, జనసేన నాయకులు
ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర జరిగింది. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించిన త్రివిధ దళాలకు మద్దత్తుగా కూటమి నాయకులు జాతీయ జెండాలు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు.
గంటల వ్యవధిలో పాకిస్తాన్ పై చేసిన దాడులతో….భారత్ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసిందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా… ముత్తుకూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర జరిగింది. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించిన త్రివిధ దళాలకు మద్దత్తుగా కూటమి నాయకులు జాతీయ జెండాలు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ముత్తుకూరు ప్రధాన కూడలి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. భారత్ మాతాకీ జై నినాదాలతో ముత్తుకూరు రహదారులు మార్మోగాయి. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే సోమిరెడ్డి,బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి, జనసేన సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్తబొబ్బేపల్లి సురేష్ నాయుడు, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…. నియోజకవర్గంలోని ఐదు మండలాల టీడీపీ అధ్యక్షులు… బీజేపీ, జనసేన నాయకులు కార్యకర్తలు, అధికారులు, ముత్తుకూరు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.