తొలి రోజు మజ్జిగ పంపిణీ
ప్రారంభించిన సీఐ శివరామకృష్ణారెడ్డి
పొదలకూరులో పోలీసు వారి చలివేంద్రం..
- తొలి రోజు మజ్జిగ పంపిణీ
- ప్రారంభించిన సీఐ శివరామకృష్ణారెడ్డి
వేసవి దృష్ట్యా పొదలకూరులో పోలీసు వారు మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని సీఐ శివరామకృష్ణారెడ్డి ప్రారంభించి…తొలి రోజు ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు.
:
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పొదలకూరులో పోలీసు వారు ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని సీఐ శివరామకృష్ణారెడ్డి ప్రారంభించారు. తొలి రోజు ప్రయాణికులు, పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిఐ శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వేసవిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తప్పనిసరి అయితే తప్ప ఎవరు మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం నాలుగు వరకు బయట తిరగవద్దని పేర్కొన్నారు. డిహైడ్రేషన్ ను తట్టుకునేందుకు ఎక్కువగా మంచినీళ్లు, ఓ ఆర్ ఎస్ తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రసూల్, షరీఫ్, శీను తదితరులు పాల్గొన్నారు