రోడ్లన్నీ చిత్తడి చిత్తడే
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు, వాహనదారులు
చినుకు పడితే…
- రోడ్లన్నీ చిత్తడి చిత్తడే
- తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు, వాహనదారులు
వెంకటరెడ్డిపల్లి గ్రామంలోని జాతీయ రహదారి నరకాన్ని తలపిస్తోంది. చినుకు పడితే చాలు ఆ రహదారి అంతా బురదమయంగా మారిపోతుంది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని వెంకటరెడ్డిపల్లి గ్రామంలోని వెంకయ్య స్వామి గుడి సమీపంలో చినుకు పడితే చాలు…జాతీయ రహదారి చిత్తడి చిత్తడిగా మారిపోతుంది. అటుగా వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ రహదారి నేషనల్ హైవే 565కి అనుసంధానం చేయడంతో ఇటు మార్గం గుండా నిరంతరం భారీ వాహనాలు తిరిగి రోడ్డు మొత్తం గుంటతమయం అయిపొయింది..గత మూడు సంవత్సరాల నుండి ఈ రోడ్డు మరమ్మత్తులకు నోచుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ఈ రహదారి మరమ్మత్తులను చేయించాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు..