ఆక్రమణదారుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

ఎస్సై గోపికి ఫిర్యాదు చేసిన మన్నూరు గ్రామ గిరిజనులు

బాలాయపల్లి పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన

ఆక్రమణదారుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

  • ఎస్సై గోపికి ఫిర్యాదు చేసిన మన్నూరు గ్రామ గిరిజనులు
  • బాలాయపల్లి పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన


బాలాయపల్లి పోలీసుస్టేషన్ ఎదుట మన్నూరు గ్రామ గిరిజనులు ఆందోళన చేపట్టారు. స్మశాన స్థలాన్ని ఆక్రమించిన జడపల్లి రమణయ్యపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.


బాలాయపల్లి మండలం పరిధిలోని మన్నూరు గ్రామం గిరిజనుల స్మశాన స్థలాన్ని ఆక్రమించిన జడపల్లి రమణయ్యపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని యానాది సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు తలపల చెంచు మల్లికార్జున డిమాండ్ చేశారు. మల్లికార్జున ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా బాలాయపల్లి పోలీసుస్టేషన్ ఎదుట గిరిజనులతో కలసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఎనబై సంవత్సరాలుగా గిరిజన కాలనీ లో మృతి చెందిన వారిని ఖననం చేసే స్మశాన స్థలాన్ని రమణయ్య ఆక్రమించడం దుర్మార్గమైన చర్య అన్నారు. స్మశానం ఆక్రమించి కులం పేరుతో దూషించిన రమణయ్య పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. అనంతరం బాలాయపల్లి ఎస్సై గోపి కు పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాళ్లు వెలుగోటి రేవతి, తిరుపతి రాములమ్మ, పానబాకుల కల్పన, మణికలా చిరంజీవి, లక్ష్మయ్య, పెంచలమ్మ, చిన్న అంకయ్య, వెంకటరమణయ్య. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *