కుప్పంలో వైసీపీకి భారీ షాక్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఏఎంసీ చైర్మన్ విద్యా సాగర్ రాజీనామా

కుప్పంలో వైసీపీకి భారీ షాక్..

  • వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఏఎంసీ చైర్మన్ విద్యా సాగర్ రాజీనామా


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, సభ్యత్వానికి విద్యా సాగర్ రాజీనామా చేశారు. దీంతో చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది.


చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఏఎంసీ చైర్మన్ విద్యా సాగర్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ….వైసిపి బలోపేతానికి అన్ని విధాల కృషి చేశానని… పార్టీ కోసం కష్టపడినా కొంత మందితో మాత్రమే ఇంచార్జ్ భరత్ సమావేశాలు పెట్టుకుంటున్నారన్నారు. కుప్పం మున్సిపల్ వైస్ చైర్మన్ మునిస్వామి, ఆయన తల్లి 15 వ వార్డు కౌన్సిలర్ ను సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నా తోటి వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసినా, నన్ను సస్పెండ్ చేసినా ఒకటేనన్నారు. అందుకే వైసీపీ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానన్నారు. నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులకు ఇంచార్జ్ ఇస్తే బాగుండేదని చెప్పారు. కుప్పంలో అందుబాటులో లేని భరత్ వెంట ఉంటే, మనం పార్టీకి న్యాయం చేయలేమని రాజీనామా చేస్తున్నానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *