కావలిలో దంచికొట్టిన వాన..

తోడైన ఈదురుగాలులు జలమయమైన రోడ్లు కావలిలో దంచికొట్టిన వాన… కావలిలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ట్రంకురోడ్డు, ఇతర రోడ్లు పూర్తిగా వర్షపునీటితో జలమయమయ్యాయి. ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణం, మండలంలో శుక్రవారం ఉదయం వర్షం దంచికొట్టింది. ఉదయం 7 గంటలకే ఆకాశం పూర్తిగా మారిపోయి దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. అలా ఈదురుగాలులతో వర్షం ప్రారంభమయ్యి ఏకధాటిగా అర్ధగంట సమయం భారీగా కురిసింది. దీంతో కావలి పట్టణంలో ట్రంక్…

Read More

21న కుప్పంకి సీఎం చంద్రబాబు..

ప్రసన్న గంగమ్మ తల్లిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు దంపతులు మీడియా సమావేశంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం 21న కుప్పంకి సీఎం చంద్రబాబు… ఈనెల 21న కుప్పంలోని గంగమ్మ తల్లి అమ్మవారిని సీఎం చంద్రబాబునాయుడు దంపతులు దర్శించుకోనున్నారని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఆలయ కమిటీ చైర్మన్ రవిచంద్రబాబులు తెలిపారు. ఈ మేరకు వారు ఆలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మే 21న కుప్పం నియోజకవర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విచ్చేస్తున్నారని ఆర్టీసీ వైస్…

Read More

చికెన్ వ్యర్ధాల వాహనాలు సీజ్..

చికెన్ వ్యర్ధాలను తరలిస్తే కేసులు నమోదు చేస్తాం సంగం ఎస్ఐ రాజేష్ హెచ్చరిక చికెన్ వ్యర్ధాల వాహనాలు సీజ్… నెల్లూరు జిల్లా సంగంలో అక్రమంగా తరలిస్తున్న చికెన్ వ్యర్థాల వాహనాలను ఎస్సై రాజేష్ అదుపులోకి తీసుకున్నారు. వాహనాలలో ఉన్న చికెన్ వ్యర్ధాలను కొండ సమీపంలోకి తీసుకెల్లి ఫిషరీస్ ,రెవెన్యూ అధికారుల సమక్షంలో గుంత తీసి పూడ్చి పెట్టారు. వాహనాలపై కేసు నమోదు చేసి సీజ్ చేశారు. ఎవరైనా అక్రమంగా చికెన్ వ్యర్ధాలను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని…

Read More

గ్రీవెన్స్ లో మంత్రి ఆనం

మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి ఆనం గ్రీవెన్స్ లో మంత్రి ఆనం… టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించి అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన వినతులను మంత్రి…

Read More

నేతల అరెస్ట్ లో మీనమేషాలు

అసలు సూత్రధారులను వదిలేసి విలేకరులపై ప్రతాపం నేతలు బెయిలు తెచ్చుకునే వరకు అనధికారిక వెసులు బాటు నేతల కోసం జబ్బలు చరిచిన విలేకరుల పరిస్థితి దారుణం నేతల అరెస్ట్ లో మీనమేషాలు… పైలాన్ ధ్వంసం కేసులో నేతల అరెస్టులో పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు సూత్రధారులను వదిలేసి విలేఖర్లపై ప్రతాపం చూపడం దారుణమని జర్నలిస్ట్ వర్గాలు వాపోతున్నాయి. అసలైన నిందితులను అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న…

Read More

రాష్ట్రంలోనే బెస్ట్ స్కూల్ గా వీఆర్ హైస్కూల్

రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ నగరంలోని వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి రాష్ట్రంలోనే బెస్ట్ స్కూల్ గా వీఆర్ హైస్కూల్… వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. తొలగించిన భవనాల స్థానం లో ప్లే గ్రౌండ్ ఏర్పాటుపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. నెల్లూరు నగరంలోని నిరుపేద విద్యార్థుల కోసం వి ఆర్ హైస్కూల్ ను కార్పొరేట్ తరహా వసతులతో రాష్ట్రంలోనే ఒక బెస్ట్ స్కూల్ గా…

Read More

మినీ ఆటోనగర్ దిన‌దినాభివృద్ధి చెందాలి

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పడుగుపాడులో మినీ ఆటో నగర్ కి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే నిన్న రాత్రి వచ్చింది మినీ ఆటోనగర్ దిన‌దినాభివృద్ధి చెందాలి… మినీ ఆటో నగర్ దిన‌దినాభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆకాంక్షించారు. పడుగుపాడులో సెంటర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మినీ ఆటో నగర్ కి ఆమె భూమి పూజ చేశారు. నెల్లూరు జిల్లా… కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ నేషనల్ హైవే లోని భారత్ బెంజ్ వెనుక వైపు…

Read More

కోవూరుకు కొత్త నీరు

మండ‌లాధ్యక్షుల‌ను ప్రక‌టించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బ‌లోపేత‌మే ల‌క్ష్యం పాత‌,కొత్త వారిని స‌మ‌న్వయం చేసుకుని.. క‌ల‌సిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని ఆదేశం కోవూరుకు కొత్త నీరు..! కోవూరు నియోకవర్గంలో టీడీపీ మండలాధ్యక్షులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రకటించారు. పాత, కొత్త వారిని సమన్వయం చేసుకొని కలసికట్టుగా పని చేసి ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీ బ‌లోపేతమే ల‌క్ష్యంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి…

Read More

కుప్పంలో వైసీపీకి భారీ షాక్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఏఎంసీ చైర్మన్ విద్యా సాగర్ రాజీనామా కుప్పంలో వైసీపీకి భారీ షాక్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, సభ్యత్వానికి విద్యా సాగర్ రాజీనామా చేశారు. దీంతో చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఏఎంసీ చైర్మన్ విద్యా సాగర్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ….వైసిపి బలోపేతానికి అన్ని…

Read More

339…@ 21వ డివిజన్

ఉమ్మారెడ్డి గుంటలో అభివృద్ధి పనులను ప్రారంభించిన జనసేన నేతలు 339…@ 21వ డివిజన్ నెల్లూరు రూరల్ డివిజన్ 21వ డివిజన్ ఉమ్మారెడ్డిగుంటలో 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం జరిగింది. జనసేన పార్టీ రూరల్ ఇంచార్జ్ పావుజెని చంద్రశేఖర్ రెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్, సుందర్ రామిరెడ్డి కృష్ణారెడ్డి, పలువురు టిడిపి బిజెపి నాయకులు పాల్గొని పనులను ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ…శ్రీధర్ రెడ్డి తలపెట్టిన 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ఎవరికీ సాధ్యమన్నారు. రూరల్ నియోజకవర్గంలో…

Read More