సమస్యల పరిష్కారం దిశగా చర్యలు

సంగం ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం

జవాన్ మురళీ నాయక్ కు నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

సమస్యల పరిష్కారం దిశగా చర్యలు…

  • సంగం ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం
  • జవాన్ మురళీ నాయక్ కు నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు


సంగం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపిపి పద్మావతమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ షాలెట్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామాలలో పలు సమస్యలపై సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.


నెల్లూరు జిల్లా సంగం ఎంపీడీవో కార్యాలయం లో ఎంపిపి పద్మావతమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ షాలెట్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ రావుల లక్ష్మి,సర్పంచ్ లు,ఎంపిటిసి లు,అధికారులు పాల్గొన్నారు.ముందుగా యుద్ధంలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళి నాయక్ కు నివాళులర్పించి మౌనం పాటించారు.ఈ సందర్భంగా మండలంలో జరిగిన అభివృద్ధి పై అధికారులు శాఖల వారీగా వివరించారు. పలు శాఖల అధికారులు ఈ సమావేశానికి గైర్హాజరవడంతో సభ్యులు సమావేశంలో లేవనెత్తారు. గ్రామాలలో పలు సమస్యలపై సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని వారికి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *