ఎమ్మెల్యేలు కావ్య, కాకర్ల -సంగం హెడ్ రెగ్యులేటర్ నుంచి కావలి కాలువకు సాగునీరు
గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి 8.7టీఎంసీ నీటి విడుదల చేసిన కావ్య, కాకర్ల
రైతుకుటుంబాల నుంచి వచ్చాం.. రైతు బాధలు తెలుసు..!
ఎమ్మెల్యేలు కావ్య, కాకర్ల
సంగం హెడ్ రెగ్యులేటర్ నుంచి కావలి కాలువకు సాగునీరు
గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి 8.7టీఎంసీ నీటి విడుదల చేసిన కావ్య, కాకర్ల
సంగం హెడ్ రెగ్యులేటర్ నుండి కావలి కాలువకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సాగునీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే లకు స్థానిక టిడిపి నాయకులు,ఇరిగేషన్ అధికారులు ఘన స్వాగతం పలికారు. రెగ్యులేటర్ వద్ద గంగమ్మ కి ప్రత్యేక పూజలు నిర్వహించి..కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 8.7 టి ఎం సిల నీటిని కావలి కాలువకు కేటాయించారని.. సోమశిల డ్యామ్ పూర్తైన తర్వాత మొట్ట మొదటి సారి అధికారులే.. సాగునీరు ఇస్తాం.. రైతులు పంటలు వేసుకోండి.. అని చెప్పడానికి కారణం సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.మెట్ట ప్రాంతానికి రెండో కారుకి నీరు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు కే దక్కుతుందని అన్నారు.
అనంతరం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ..గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఇరిగేషన్ కు ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాన పోలేదని విమర్శించారు. ఉదయగిరి,కావలి నియోజకవర్గ ప్రజలకు తెలుసు గత ఐదేళ్లలో ఏమి జరిగిందో అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే సిఎం చంద్రబాబు నాయుడు సోమశిల ను సందర్శించారని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి నీటి విలువ తెలుసు కాబట్టి సాగునీటి సంఘం ఎన్నికలు నిర్వహించింధని అన్నారు.ఇద్దరు ఎమ్మెల్యే లము రైతు కుటుంబాల నుండి వచ్చాము కాబట్టి.. కాలువలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. 70 వేల ఎకరాల రైతుల ముఖాలలో ఆనందం చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో సోమశిల ఎస్ ఈ రమణారెడ్డి, టీడీపీ నాయకులు,సాగునీటి సంఘం అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు.