నెల్లూరు రూరల్ లో 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల జాతర
రూ. 41 కోట్ల వ్యయంతో.. 60 రోజులలో పూర్తి చేసిన..339 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
339 పనులను ఆపరేషన్ సిందూర్ యుద్ధ వీరులకు అంకితం
మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి
చరిత్రలో నిలిచిపోయే రోజు రేపే..!
- నెల్లూరు రూరల్ లో 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల జాతర
- రూ. 41 కోట్ల వ్యయంతో.. 60 రోజులలో పూర్తి చేసిన..339 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
339 పనులను ఆపరేషన్ సిందూర్ యుద్ధ వీరులకు అంకితం
మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే సమయానికి 339 అభివృద్ధి పనులు.. 678 మంది పార్టీ నాయకులు, కార్యకర్తల చేత ప్రారంభోత్సవం మహోత్సవం రేపేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు.
ఆనాడు 60 రోజుల ముందు ప్రజల చేత శంకుస్థాపనలు చేసి.. అదే ప్రజల సాక్షిగా.. పార్టీ నాయకులు, కార్యకర్తల చేత ప్రారంభోత్సవాలు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరగిందని.. అలాగే.. ఈ 339 అభివృద్ధి పనులను ఆపరేషన్ సింధూర్ భారత యుద్ధవీరులకు అంకితం చేస్తున్నానని ఈసందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం నెల్లూరులోని తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఆయా వివరాలను వెళ్లడించారు. చెప్పిన మాటకు కట్టుబడి 5 రోజుల ముందే.. మే 15వ తేదీన ఉదయం 09:00 గంటలకు.. ఒకేరోజు.. ఒకే సమయానికి 339 చోట్ల ప్రారంభోత్సవ మమోత్సవాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. 24వ డివిజన్, కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు మెయిన్ రోడ్డు లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి మునిసిపల్ శాఖామంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్రలు పాల్గొంటారన్నారు. ఇంతటి అద్భుత అవకాశం తనకు కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనాయకుడు నారా లోకేష్, ఓటువేసి 3వసారి ఎమ్.ఎల్.ఏగా చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు, కష్టం చేసిన పార్టీ కార్యకర్తలకు ఈసందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.