లక్షలు ఖర్చు చేసి పండించాం
పొగాకు రైతుల ఆందోళన
సరైన ధరలేక ఇబ్బంది పడుతున్నాం
- లక్షలు ఖర్చు చేసి పండించాం
- పొగాకు రైతుల ఆందోళన
లక్షల ఖర్చు చేసి పండించిన పొగాకు పంటకు సరైన ధర లేక ఇబ్బంది పడుతున్నామని పొగాకు రైతులు ఆందోళనకు దిగారు. నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం, డిసిపల్లి పొగాకు వేలం కేంద్రం పరిధిలో పొగాకు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నామని, బోర్డు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది పొగాకు మార్కెట్ ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. పొగాకు మార్కెట్ ఈ విధంగా ఉంటే ప్రతి రైతుకు నాలుగు నుంచి ఐదు లక్షలు నష్టం వచ్చే ప్రమాదం ఉందన్నారు. డిసి పల్లి పొగాకు వేలం కేంద్ర పరిధిలో సుమారు 2200 పొగాకు బ్యారన్లు ఉన్నాయని, 3000 మంది రైతులు పొగాకు పంటను పండిస్తున్నారన్నారు. ఏడాది పొగాకు సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు, గత ప్రభుత్వంలో రైతులకు పొగాకు గిట్టుబాటు ధర లభించడం జరిగిందని, ఈ కూటమి ప్రభుత్వంలో పొగాకు రైతులకు, పొగాకు ధారలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతులను దృష్టిలో ఉంచుకొని కంపెనీ యజమానులతో మాట్లాడి సరైన గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.