సాదరస్వాగతం పలికిన ఆలయ కమిటీ నిర్వాహకులు
శ్రీ సత్యమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే పులివర్తి నాని
- సాదరస్వాగతం పలికిన ఆలయ కమిటీ నిర్వాహకులు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని పాకాల శ్రీ సత్యమ్మ తల్లి గంగ జాతర ఘనంగా జరుగుతన్నాయి. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పు, కొంగుబంగారంగా వెలసిన శ్రీసత్యమ్మ తల్లి ప్రసిద్ధి చెందిందని స్థానిక ప్రజల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా ఈ జాతరకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విచ్చేశారు. ఆయన శ్రీ సత్యమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన మొక్కలు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మంగళ వాయిద్యాలతో, వేద పండితులతో ఘన స్వాగతం పలికారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు,భక్తులు,కూటమి నాయకులు,కార్యకర్తలు,పాల్గొన్నారు.