కనిగిరి ప్రధాన కాలువలో అన్నదమ్ములు గల్లంతు
చందు, నందుల మృతదేహాలు లభ్యం
సంగంలో ప్రాణం తీసిన ఈత సరదా
మృతదేహాల వద్ద మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు
వేసవి సెలవులకొచ్చి….
- కనిగిరి ప్రధాన కాలువలో అన్నదమ్ములు గల్లంతు
- చందు, నందుల మృతదేహాలు లభ్యం
- సంగంలో ప్రాణం తీసిన ఈత సరదా
- మృతదేహాల వద్ద మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు
వేసవి సెలవులు కావడంతో సరదాగా ఈత కొట్టేందుకు కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో దిగిన ఇద్దరు అన్నదమ్ములు ప్రమాదశాత్తు మృతి చెందారు. ఈ సంఘటన సంగం లో చోటుచేసుకుంది. కోవూరుకి చెందిన గోవిందయ్య, శేషమ్మ కుమారులు బందా వెంకట చందు (15) ,బందా వెంకట నంద కిషోర్(12) లు పాఠశాలకు వేసవి సెలవులు ఇవ్వడంతో సంగంలో బంధువుల ఇంటికి వచ్చారు. ప్రతీ రోజు తన స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లేవారు. అదే క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఈత కొట్టేందుకు సంగం కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో దిగారు. కాలువలో నీరు వేగంగా వెళ్తుండటంతో ప్రమాదవశాత్తు ఇద్దరు అన్నదమ్ములు గల్లంతయ్యారు. స్నేహితుడు మునిగిపోవటం చూసి భయాందోళనకు గురై ఆ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియచేశారు.వెంటనే పోలీస్ లకు తెలియచేయడంతో సీఐ వేమారెడ్డి, ఎస్సై రాజేష్ లు స్థానికుల సహాయం తో గాలింపు చర్యలు చేపట్టారు. బ్యారేజి వద్ద నీటి మట్టం తగ్గించి తర్వాత రోజు గాలింపు చేపట్టారు. మంగళవారం ఉదయం చందు మృతదేహం లభ్యమైంది.కాసేపటి క్రితం నందు మృతదేహం లభ్యమైంది.ఇద్దరు అన్నదమ్ముల మృతదేహాలు లభ్యమయ్యాయి.మృతదేహాల వద్ద తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.