మాటిస్తున్నా…రేపే పరిష్కరిస్తా

మొట్టమొదటిసారిగా ఈ గ్రామంలో చరిత్ర సృష్టించాం

గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది

సర్పంచ్‌లకు ఒక్క రూపాయి రాలేదు..

రేపే జేసీతో మాట్లాడుతా…సమస్య క్లియర్ చేస్తా

మాటిస్తున్నా…రేపే పరిష్కరిస్తా

  • మొట్టమొదటిసారిగా ఈ గ్రామంలో చరిత్ర సృష్టించాం
  • గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది
  • సర్పంచ్‌లకు ఒక్క రూపాయి రాలేదు..
  • రేపే జేసీతో మాట్లాడుతా…సమస్య క్లియర్ చేస్తా


రెడ్డిపాళెం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. తమ దంపతులను ఆశీర్వదించిన గ్రామానికి అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రజల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామనీ ఎమ్మెల్యే హామి ఇచ్చారు.


గత పాలకుల తప్పుడు విధానాల వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు..నెల్లూరు జిల్లా బుచ్చి మండలంలోని రెడ్డిపాళెం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీరోడ్లను పార్టీ నాయకులతో‌ కలిసి ఆమె ప్రారంభించారు..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజవర్గంలో మొట్టమొదటి బూత్ అయినటువంటి రెడ్డిపాలెంలో 90 ఓట్ల మెజారిటీ వచ్చిందన్నారు. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకు రెడ్డిపాళెంలో ఇంతపెద్ద మెజారిటీ రాలేదని… తమ దంపతులను ఆశీర్వదించిన గ్రామానికి అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రజల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామనీ ఎమ్మెల్యే హామి ఇచ్చారు… గత వైసిపి ప్రభుత్వంలో కనీసం సర్పంచుల ఖాతాల్లో ఒక్క రూపాయి వేయలేదనీ విమర్శించారు.. టిడిపి అధికారంలోకి రాగానే గ్రామ 15వ ఆర్థిక నిధులు మంజూరయ్యాయని దీంతో గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టామని తెలిపారు.. గ్రామానికి చెందిన పలువురు రైతుల భూములు అడంగల్లోకి నమోదు కాలేదని.. దీంతో రుణాలు కూడా మంజూరు కావడం లేదని విన్నవించడంతో రేపే జేసితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు.. గత ఎమ్మెల్యేలకు ముడుపులు అందించి బిల్లులు చేయించుకుని పనులను మధ్యలోనే వదిలేసి వెళ్లారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *