నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు క‌ల‌క‌లం రేపే క‌థ‌నాలు

రానున్న వేసవి దృష్ట్యా రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నామని డీఎస్ఆర్పీ మురళీధర్ చెప్పారు. పూరీ – తిరుపతి ఎక్స్ ప్రెస్ లో పట్టుబడ్డ గంజాయి కేసుకు సంబంధించి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆరు కేజీల గంజాయిని, ఇద్దరు నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

వర్షాలు పడే వరకు తాగునీటి ఇబ్బంది తలెత్తకూడదని అధికారుల్ని మంత్రి నారాయణ ఆదేశించారు. అమరావతిలో మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు.

శ్రీ వేయి లింగేశ్వరస్వామి స్వామి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. స్వామి, అమ్మవార్లకు దేవదాయ శాఖ ఈవో శ్రీనివాసరెడ్డి, వెంకటగిరి సీఐ వెంకటరమణలు పట్టువస్త్రాలు సమర్పించారు.

వెంకట్రావుపల్లి గ్రామంలో వీపీఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో విపిఆర్ అమృతధార వాటర్ ఫ్లాంట్ ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ లు ప్రారంభించారు. ఫ్లోరైడ్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని వేమిరెడ్డి తెలిపారు.

జూన్ నెలలో కావలి ప్రెస్ క్లబ్ నేనే కట్టిస్తానని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రకటన చేశారు. అధికార, రాజకీయ, మీడియా సంఘాల, ప్రజా సంఘాల సమక్షంలో శంకుస్థాపన చేస్తానని ఆయన చెప్పారు

వేయి లింగేశ్వరస్వామి వారిని వెంకటగిరి సీఐ రమణ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరునాళ్లలో దొంగలు ఉన్నారని భక్తులందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి బెల్టు షాపుల సెగ తగిలింది. వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ కి వెళ్లిన ఎమ్మెల్యేకి బెల్టు షాపులు నిర్మూలించాలనే డిమాండ్లతో మహిళలు స్వాగతం పలికారు. బెల్టు షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పోలీసుల్ని ఆదేశించారు.

ప్రతి ఒక్కరు సేవా దృక్పథంతో పనిచేయాలని అడిషనల్ డీఎంఅండ్ హెచ్వో డాక్టర్ ఖాదర్ వల్లి సూచించారు. కోవూరు సీహెచ్సీలో జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవంలో ఆయన పాల్గొని నర్సుల సేవలను కొనియాడారు.

అభివృద్ధికి మారుపేరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ అని 29వ డివిజన్ అధ్యక్షులు గుద్దేటి చెంచయ్య తెలిపారు. కోటంరెడ్డి సోదరుల సహాయ సహకారాలతోనే మహాత్మాగాంధీ నగర్లో 1.22 కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహించామన్నారు.

నర్సుల సేవలు వెలకట్టలేనివని నారాయణ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ డాక్టర్ హరి ప్రసాద్ రెడ్డి ప్రశంసించారు.
నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవంలో ఆయన పాల్గొని నర్సులతో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. కార్యాలయ ఆవరణంలో ఉన్న పందిరి, సీసీ కెమెరాలు, టీవీ, కుర్చీలు, ఆఫీస్ సామాగ్రి అగ్నికి దగ్ధమైనాయి.

ఉపాధి పనికి తమను రానివ్వడం లేదంటూ కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట దప్పలంపాడు ఎస్సీ కాలనీ వాసులు నిరసన చేపట్టారు. మీరే మాకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ శ్రీపూజకు వినతి పత్రం అందచేశారు.

రెడ్డిపాళెం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. తమ దంపతులను ఆశీర్వదించిన గ్రామానికి అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రజల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామనీ ఎమ్మెల్యే హామి ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *