లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎస్పీ కృష్ణ కాంత్
నరసింహుని సేవలో ఎస్పీ
- లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎస్పీ కృష్ణ కాంత్
పెంచలకోనలో జరుగుతున్న నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎస్పీ కృష్ణ కాంత్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నెల్లూరు జిల్లా రాపూరు మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఆశీర్వాచనాలు అందచేశారు. స్వామి వారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఎస్పీతోపాటు…డిఎస్పి వేణుగోపాల్, పోలీస్ అధికారులు, ఈవో పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఫెస్టివల్ కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్రెడ్డి,సోమయ్య యాదవ్,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.