కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి

మార్పులు, చేర్పుల కోసం సచివాలయాల్లో సంప్రదించాలి

కమిషనర్ వై ఓ నందన్

కార్పొరేషన్ కార్యాలయంలో అర్జీలు స్వీకరించిన కమిషనర్

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి

  • మార్పులు, చేర్పుల కోసం సచివాలయాల్లో సంప్రదించాలి
  • కమిషనర్ వై ఓ నందన్
  • కార్పొరేషన్ కార్యాలయంలో అర్జీలు స్వీకరించిన కమిషనర్


.నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కమిషనర్ నిర్వహించారు. ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. అర్హులందరూ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులందరికీ కొత్త రేషన్ కార్డులను స్థానిక వార్డు సచివాలయాల ద్వారా మంజూరు చేస్తున్నామని, రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు ఉన్నవారు సంబంధిత సచివాలయాల్లో సంప్రదించాలని కమిషనర్ వై.ఓ నందన్ సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… నూతనంగా వివాహమైన వారు రేషన్ కార్డుల దరఖాస్తు కోసం వివాహ ధ్రువీకరణ పత్రాన్ని కూడా సమర్పించాలని, పూర్తి వివరాలకోసం సంబంధిత సచివాలయ కార్యదర్శులను సంప్రదించాలని సూచించారు. పి.ఎమ్.ఈ.వై 2 పథకం ద్వారా నూతనంగా లబ్ధిదారులకు టిడ్కో గృహాలను మంజూరు చేస్తున్నామని తెలిపారు. మొత్తం 40 విజ్ఞప్తులను అందుకున్నామని, నిర్దేశించిన గడువు లోపు పరిష్కరించేందుకు సంబంధిత విభాగం చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్ మోహన్ రావు, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చైతన్య, సెక్రటరీ శ్రీలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషగిరిరావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *