నెల్లూరు కలెక్టరేట్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ జేసీ, అధికారులు
కలెక్టర్ సారూ…మా సమస్యల్ని పరిష్కరించండయ్యా
- నెల్లూరు కలెక్టరేట్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ జేసీ, అధికారులు
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుంచి కలెక్టర్ ఆనంద్ వినతులు స్వీకరించారు. ప్రతీ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు.
నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ ఆనంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…జేసీ కార్తీక్, అధికారులతో కలిసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అయ్యా సారూ తమ సమస్యల్ని వెంటనే పరిష్కరించండయ్యా అంటూ బాధితులు కలెక్టర్ ఎదుట మొరపెట్టుకున్నారు. గ్రీవెన్స్ కి వచ్చే ప్రతీ అర్జీని అధికారులు, సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించి…త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అన్నీ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.