శివాలయంలో పూజలు చేసిన బీజేపీ నేతలు
త్రివిధ దళాలు క్షేమంగా ఉండాలి…
- శివాలయంలో పూజలు చేసిన బీజేపీ నేతలు
పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధంలో పోరాడుతున్న “త్రివిధ దళాలు” క్షేమంగా ఉండాలని బీజేపీ నేతలు పరమేశ్వరుడిని ప్రార్ధించారు. శివాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధంలో పోరాడుతున్న “త్రివిధ దళాలు” క్షేమంగా ఉండాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకాంక్షించారు. నెల్లూరు నగరం శ్రీరంగరాజపురంలోని శివాలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలతో కలిసి ఆలయం ఎదుట టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం బైరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో RSS, బిజెపి నేతలు రవికృష్ణ, కిషోర్ కుమార్, సందీప్ చైతన్య, చంద్ర, హర్షవర్ధన్, మహేష్, హాజరత్తయ్య, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.